దండం దశ గుణం భవేత్ అని ఒక సామెత ఉంది అంటే కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు అని అర్థం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అచ్చంగా కొన్నిసార్లు దీనిని అమలు చేస్తూ ఉంటారు. దూకుడు చూపించబోయిన మాల్దీవులు విషయంలో ఆయన అమలు చేసిన ప్రణాళిక పూర్తి ఫలితాలు ఇచ్చింది. ఇప్పుడు మాల్దీవులు దాదాపుగా కాళ్ల బేరానికి వచ్చింది.
గత జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన భారతదేశానికి చెందిన లక్షద్వీప్ దీవుల్ని సందర్శించారు. అక్కడ పర్యాటక అద్భుతాలను హైలైట్ చేస్తూ ఫోటోలు వీడియోలు షేర్ చేశారు. లక్షద్వీప్ ప్రాంతం అరేబియా సముద్రంలో చక్కటి పర్యాటక కేంద్రం అని కొనియాడారు. దీనిమీద అనవసరంగా జోక్యం చేసుకున్న కొందరు మాల్దీవులు మంత్రులు విపరీతంగా నోరు పారేసుకున్నారు. అదే సమయంలో చైనాకు తొత్తుగా మారిన ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయుజు మరి కాస్త దూకుడు ప్రదర్శించారు. దౌత్యపరమైన విభేదాల సమయంలో భారత బలగాలను వెనక్కి పంపించాలని నిర్ణయించారు. చైనా మెప్పుకోసం ఇటువంటి పనులు చేయడం మీద భారత్ సీరియస్ అయింది.
ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేశారు. రెండువైపులా మాటల తూటలు పేలుతున్న సమయంలో భారత్ నుంచి చాలామంది ప్రముఖులు మాల్దీవులు పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో విమాన సర్వీసులు, హోటల్ బుకింగ్లు పెద్ద ఎత్తున పడిపోయాయి. నిజానికి మాల్దీవ్స్ ని సందర్శించే పర్యాటకుల జాబితాలో భారతీయులదే అత్యధిక శాతం. కానీ ఈ నాలుగు నెలల్లో సగం మంది పర్యాటకులు మాల్దీవులకి ప్రయాణం రద్దు చేసుకొన్నారు. ప్రధానంగా పర్యాటక రంగం మీద ఆధారపడిన మాల్దీవులు పరిస్థితి అతలాకుతలమై పోయింది. దీంతో ఇప్పుడు మాల్దీవులు కిందకు దిగి వచ్చింది. దయచేసి మా దేశానికి రండి అని మాల్దీవులు సీనియర్ మంత్రి ఇబ్రహీం పైసల్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. మా ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా ఘనస్వాగతం పలుకుతుందని ఆయన అన్నారు. మొత్తం మీద విదేశీ విధానంలో నరేంద్ర మోడీ మార్కు చక్కగా పని చేసింది.
You must log in to post a comment.