తెలంగాణకు కొత్తగా నియమితులైన పది మంది న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ. సీజే ఎన్వీరమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్స్ మేరకు 10మంది న్యాయమూర్తుల నియామకాలకు మంగళవారం రాష్ట్రపతి కోవింద్ ఆమోద ముద్ర వేశారు. వీరితో పాటు ఐదుగురు న్యాయవాదులు, మరో ఐదుగురు న్యాయాధికారులనూ నియమించారు.
ఫిబ్రవరి ఒకటిన సుప్రీంకోర్టు కొలీజియం ఏడుగురు న్యాయవాదులు, 5 మంది జ్యుడీషియల్ అధికారుల పేర్లను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కోసం సిఫార్సు చేయగా వారిలో పది మంది నియామకాలకు కోవింద్ ఆమోదముద్ర వేళారు. దీంతో తెలంగాణ హైకోర్టులో సీజేతో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. అసలైతే 42 మంది న్యాయమూర్తులుండాల్సి ఉంది.
కొత్తగా నియమితులైన న్యాయమూర్తుల్లో కాసోజు సురేందర్ , సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్ కుమార్ , శ్రీమతి. జువ్వాడి శ్రీదేవి, నాచ్చరాజు శ్రవణ్కుమార్ వెంకట్ , గన్నుఅనుపమచక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శి,సాంబశివరావు నాయుడు,అనుగు సంతోష్రెడ్డి, డాక్టర్ దేవరాజునాగార్జున్ ఉన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)