ఇంట్లో పోరు ఎలా ఉన్నా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కలిసికట్టుగా ఉండాలి అనేది ప్రాథమిక నీతి. కానీ మన దేశంలోని కొన్ని పార్టీలు మాత్రం ఈ నీతిని పాటించడం లేదు. రాజకీయ స్వార్థం కోసం కొన్ని పార్టీలు ఎంతకైనా తెగించడం గమనించాల్సిన విషయం.
జమ్మూ కాశ్మీర్ దగ్గర సరిహద్దులకు సంబంధించి మన దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టంగా స్పందించారు. సరిహద్దు గ్రామాల్లో చిల్లర పనులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా ఒకప్పుడు భారత్లో అంతర్భాగమేనని ఆయన గుర్తు చేశారు. సహజంగా ఇటువంటి విషయాల్లో భారత్ లోని అన్ని పార్టీలు, సంస్థలు ఒకే మాట మీద ఉండాలి. దేశం తరఫున రక్షణ శాఖ మంత్రి చేస్తున్న ప్రకటనలకు సంఘీభావంగా నిలవాలి.
కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే జమ్మూ కాశ్మీర్లోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత అబ్దుల్లా నోరు పారేసుకున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ జోలికి వెళ్లడం తప్పని, అలా వెళ్ళినట్లయితే పాకిస్తాన్ ఏమి చేతులకు గాజులు తొలగించుకుని లేదని మండిపడ్డారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో మొదటి నుంచి పాకిస్తాన్ కు మద్దతుగా ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయి .
దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ మరియు దాని మిత్ర పార్టీలూ భారతదేశ సార్వభౌమత్వం కన్నా పాకిస్తాన్ ప్రయోజనాలు, మైనార్టీల బుజ్జగింపులకే పెద్ద పీట వేస్తున్నాయి అని అర్థమవుతుంది.