తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికాలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన రెండువారాల పర్యటన కోసం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడి ప్రముఖ కంపెనీల ప్రతినిధుల్ని ఆయన కలుసుకున్నారు. ఎన్నారైలతోనూ సమావేశం అయ్యారు. ముఖ్యంగా తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి పథకానికి నిధుల గురించి అక్కడి వాళ్లతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలోని సర్కారు బడుల బాగు కోసం ప్రవాస తెలుగు వాళ్లు భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగా… కాలిఫోర్నియాలోని శాన్ జోస్ సిటీ మిల్పిటాస్లో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్’కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు మంత్రి.
ఇప్పటికే తెలంగాణ పెట్టుబడులకు హబ్గా మారింది. అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థలే కాక… ఎన్నో ఫార్మా కంపెనీలు, ఆటోమొబైల్ సంస్థలు భాగ్యనగరానికి తరలివచ్చాయి. అయితే మరిన్ని పెట్టుబడులను ఆకర్శించేందుకు వెళ్లిన ఆయన ఈనెల 26 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. రాష్ట్రప్రభుత్వం పథకాల అమలులో ఎన్నారైలను భాగస్వాముల్ని చేయడంపై కేటీఆర్ టూర్ ప్రత్యేక దృష్టి పెడుతోంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)