జిట్టా బాలకృష్ణారెడ్డి యువ తెలంగాణ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం అయింది. పార్టీ అధ్యక్షుడు జిల్లాబాలకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేతల సమక్షంలో తమ పార్టీని విలీనం చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా, రుద్రమలు క్రియాశీలకంగా వ్యవహరించారు. వారితో పాటు రెడ్డి జాగృతి వ్యవస్థాపకుడు పిట్టా శ్రీనివాసరెడ్డి కూడా బీజేపీలో చేరారు.
తమ పార్టీలో చేరాలంటూ ఇద్దరు నేతలకూ బీజేపీతో పాటు కాంగ్రెస్ నుంచీ ఆఫర్లు వచ్చాయి. చివరకు వాళ్లు బీజేపీ వైపు మొగ్గు చూపారు. బుధవారం పార్టీలోని మరికొందరు నాయకులతో కలిసి ఢిల్లీలో పార్టీని విలీనం చేశారు.
అంతకు ముందే తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని పార్టీ చీఫ్ నడ్డాకు లేఖ రాశారు. అధిష్ఠానం నుంచి గ్రీన్సిగ్నల్ రావడంతో ముహూర్తం నిర్ణయించుకుని ఇవాళ పార్టీలో చేరారు. జిట్టా బాలకృష్ణారెడ్డి భువనగిరి లోక్సభ స్థానాన్ని,గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏదైనా ఓ అసెంబ్లీ స్థానాన్ని రుద్రమ కోరుతున్నట్టు తెలిసింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)