వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ పెద్దలతో అంట కాగిన పోలీస్ అధికారులకు షాక్ లు తగులుతున్నాయి. అప్పట్లో వైసిపి నాయకులు స్టాండ్ అంటే నుంచోడం సిట్ అంటే కూర్చోవడానికి కింద కొంతమంది పోలీస్ అధికారులు వ్యవహరించారు. అంతేకాకుండా వైసిపి నేతలు చెప్పిన వాళ్ళని పోలీస్ స్టేషన్లోకి తీసుకువచ్చి బెదిరించడం వేధించడం వంటి పనులు నిస్సిగ్గుగా చేసేసారు. చట్టాలను తుంగలో తొక్కిపోయిన పోలీసు అధికారులకు ఇప్పుడు షాక్ లు తగులుతున్నాయి.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ వర్గాలలో ముంబై నటి కేసు వ్యవహారం కలకలం రేపుతోంది. అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్లు పి.సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలపై సహితం చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశముంది.
ఐపీఎస్ అధికారులు దారుణాలను ముంబై హీరోయిన్ కాదంబరి ఇప్పటికే బయటపెట్టారు.
అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్గున్ని, వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్లపై కేసు నమోదు చేయాలని ఆమె ఫిర్యాదు చేశారు. వీరంతా కుమ్మక్కై చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు.
ఇప్పటికే ఆమె విజయవాడలో న్యాయవాదులను కలిసి చర్యలు మొదలుపెట్టారు.
విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం స్టేషన్కు వెళ్లారు. సీఐ చంద్రశేఖర్కు ఈ మేరకు ఆమె ఫిర్యాదును అందజేశారు. ఆమె వెంట తండ్రి నరేంద్ర కుమార్ జత్వానీ, తల్లి ఆశా జత్వానీ ఉన్నారు.
విద్యాసాగర్తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి, హుటాహుటిన అక్రమంగా కేసు నమోదు చేసి, తనతో పాటు తల్లిదండ్రులను ముంబయిలో అరెస్టు చేశారని అందులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగమేఘాలపై ముంబయి వచ్చి ముగ్గుర్ని అరెస్టు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆమె ఆరోపించారు.
అప్పట్లో పోలీస్ అధికారులు ఎంత దారుణాలకు పాల్పడ్డారో కళ్ళకు కట్టినట్లు ఆమె వివరించారు. కస్టడీకి తీసుకున్న ఐదు రోజులూ తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, అర్ధరాత్రి కూడా ఇంటరాగేషన్ చేశారని వివరించారు. ఏ తప్పూ చేయకపోయినా తమ కుటుంబం 42 రోజుల పాటు విజయవాడ కారాగారంలో ఉండాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారకులైన ఐపీఎస్ అధికారులు, విద్యాసాగర్పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో నటి కాదంబరి కోరారు.
మొత్తం మీద ప్రభుత్వ పెద్దలను మంచి చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్న పోలీసులకు ఇది ఒక రకంగా షాక్ అని అనుకోవచ్చు. రాజకీయ నాయకుల కోసం సామాన్యులను వేధించడం బలిపెట్టడం వంటి అలవాట్లను పోలీసులు మానుకుంటే మంచిది.