తన నియోజకవర్గ కుప్పంపై చంద్రబాబు పగ పట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మండలంలోని జరుగు పంచాయతీలో పర్యటించిన ఆయన..అక్కడ నిలిచిపోయిన హంద్రీనీవా పనుల్ని పరిశీలించారు. కావాలనే పనులు ఆపేశారన్నారు. 90శాతం పనులు పూర్తయ్యాయని 10శాతం మిగిలిన పనుల్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయిందని మండిపడ్డారు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులను ఖండించిన చంద్రబాబు అధికార పార్టీ దౌర్జన్యాలు చూస్తుంటే ఆందోళన కలుగుతోందన్నారు. టీడీపీ గూండాలపై న్యాయపరమైన పోరాటం చేస్తామని కార్యకర్తలను కాపాడుకుంటామని చంద్రబాబు హామీఇచ్చారు.