పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పార్టీ పట్ల విధేయతను చాటుకున్న కర్నాటక బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్పకు స్వయంగా ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సామాన్య కార్యకర్తనని గొప్పగా చెప్పుకునే మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని.. పార్టీకి చేసిన సేవలు అమోఘమని ప్రశంసించారు. యడ్యూరప్పతో పాటు మీరూ పార్టీకి ఎంతో సేవ చేశారని మోదీ గుర్తు చేశారు. శివమొగ్గనుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈశ్వరప్పకు ఈసారి పార్టీ టికెట్ ఇవ్వలేదు. అసలైతే ఆయన పోటీలో ఉండాలనే భావించారు. కానీ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరులేదు. శివమొగ్గకు చెందిన చెన్నబసప్పకు టికెట్ ఇచ్చింది పార్టీ. అయితే పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని..పార్టీకి ప్రచారం చేసి బనప్పను గెలిపిస్తానని ఆ వెంటే ఈశ్వరప్ప ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు.
స్వయంగా ప్రధాని ఫోన్ చేయడంపై ఈశ్వరప్ప సంతోషం వ్యక్తం చేశారు. పార్టీకి తాను సేవలకు ప్రధాని నుంచి ప్రశంసలు వస్తాయని ఊహించలేదన్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఈశ్వరప్ప అందరితో షేర్ చేసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.
#KarnatakaElection2023 | I didn't expect his (PM) call, it inspires me to win Shivamogga city and we'll try all possibilities to bring the BJP govt back in Karnataka. It’s not something special I have done. I have told the same to PM: KS Eshwarappa after receiving the PM's call pic.twitter.com/Jngd63nxTq
— ANI (@ANI) April 21, 2023