ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో ఘోరం జరిగింది. మైనర్ బాలికను రిడ్నాప్ చేసిన ఓ ముస్లిం యువకుడు ఆమెపై మూడునెలల పాటు అత్యాచారం చేశాడు. ఆ మూడు నెలల పాటు ఆమెను రకరకాల ప్రాంతాలకు తిప్పిన యువకుడు చివరకు లూథియానాలో పోలీసులకు దొరికిపోయాడు.
షంషుద్దీన్ హరిద్వార్లోని పిరాన్ కలియార్కు చెందినవాడు. అతను డెహ్రాడూన్లో తాపీ మేస్త్రీగా పనిచేసేవాడు.
2021 అక్టోబర్లో 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. 28 అక్టోబర్ 2021న బాధితురాలి తండ్రి వసంత్ విహార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు స్టేషన్ ఇన్ చార్జి నరేష్ రాథౌడ్ కేసు నమోదు చేశాడు. అయినా అతన్ని పట్డుకోలేకపోయారు. మూడు నెలలుగా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అతను లూథియానాలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈనెల 6న డెహ్రాడూన్ పోలీసులు లూథియానాలో అతన్ని అరెస్ట్ చేసింది. బాలికను మూడు నెలల పాటు వివిధ ప్రాంతాల్లో పెట్టి పలుమార్లు అత్యాచారం చేసినట్టు విచారణలో తేలింది. దీంతో నిందితునిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఉత్తరాఖండ్ లో ముస్లిం యువకులు మైనర్లను కిడ్నాప్ చేసి అత్యాచారాలు చేస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. వాణి విహార్ ప్రాంతంలోనూ సొహైల్ అనే యువకుడు 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. బాలికను కుటుంబ సభ్యులు గుర్తించి తీసుకొచ్చారు . పరారీలో ఉన్న నిందితుడికోసం పోలీసులు గాలిస్తున్నారు.