తెలంగాణ మంత్రి కేటీఆర్ ను బీజేపీ అధికార ప్రతినిధి ఖేమ్ చంద్ శర్మ ఇడియట్ అనడం కలకలం రేపుతోంది… కరోనా వ్యాక్సిన్ విషయంలో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లెట్స్ టాక్ వ్యాక్సినేషన్ యాష్ ట్యాగ్ తో మంత్రి కేటీఆర్ ఆదివారం సాయంత్రం ట్విట్టర్ చాట్ ప్రారంభించారు.
ఆ ట్విట్టర్ చాట్ లోనే గొడవ జరిగింది. తన చర్చలో కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్రం వ్యాక్సిన్లకు ఆలస్యంగా ఆర్డర్లు ఇస్తోందన్నారు. భారత్ వ్యాక్సిన్ల హబ్ గా ఉన్న స్థితిలో ఇక్కడ డిమాండ్ – సరఫరా మధ్య తేడా ఎందుకు ఉందని, దీనిపై సందేహాలున్నాయనీ అన్నారు.
మిగతా దేశాలు 2020 తొలి దశలో టీకాలకు ఆర్డర్లు ఇచ్చాయని, భారత ప్రభుత్వం ఆలస్యంగా నిద్ర లేచిందని కేటీఆర్ విమర్శించారు..కేటీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ అధికార ప్రతినిధి ఖేమ్ చంద్ శర్మ “యూ ఇడియట్… ఫేక్స్ ప్రచారం చేస్తావా” అంటూ ఆయన మండిపడ్డారు.
అటు ట్విట్టర్ వేదిగ్గా ఇద్దరునేతల మధ్య జరిగిన పోరుపై నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.. రెండు రోజుల క్రితం కూడా బీజేపీవాళ్లను కేటీఆర్ అంధభక్తులంటూ అవహేళన చేశారని…అందుకు పార్టీ స్పోక్ పర్సన్ గట్టిబదులేఇచ్చారని చెప్పుకుంటున్నారు.