వైద్యానికి బడ్జెట్ పెంచమని తాను అడిగానని… కానీ నాకు ఎక్కడ మంచిపేరు వస్తుందోనని నేను బయటకు వచ్చాక ఇప్పుడు ప్రకటించారని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంట లో బీజేపీ నూతన కార్యాలయం లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, తెలంగాణ సర్కారుపై మండిపడ్డారు .
తెలంగాణలో85 % బడుగు బలహీనర్గాలకు చెందిన వారేనన్న ఈటల…ప్రస్తుత ప్రభుత్వ పెద్ద ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలేనని విమర్శించారు. దళిత సీఎం హామీ దేవుడెరుగు….ఉపముఖ్యమంత్రినీ తీసేసి దళితులను
అవమానించారన్నారు. 16 శాతం జనాభా ఉన్నవారికి ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి.. 0.5 శాతం ఉన్నవారికి ఎన్ని పదవులు ఉన్నాయో అందరూ చూస్తున్నారని అన్నారు. మాదిగ కు ఒక మంత్రి, మాలకు ఒక మంత్రి అర్హులు కాదా? సీఎం కార్యాలయంలో ఎంత మంది బడుగు బలహీన వర్గాల వారు ఐఏఎస్ లు ఉన్నారు. ఈ జాతులు పనికి రావా ? అని నిలదీసిన ఈటల. … ఈ జాతులకు ఆ నైపుణ్యం లేదు అని కేసీఆర్ అవమానించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో దళితుల డబ్బును టాంక్ బండ్ మీద విగ్రహాలు ఖర్చు చేస్తారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీదనా అని తానెప్పుడో నిలదీశానని…ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు.
నిజాయితీ ఉంటే sc లకు జనాభా ప్రాతిపదికన మంత్రి వర్గంలో చోటు కల్పించాలని టీఆర్ఎస్ ను సవాల్ చేశారు.
ఇక్కడికి వచ్చిన మంత్రులు నిధులు ఇస్తామని భవనాలు ఇస్తామని హుజురాబద్ లో చెప్తున్నారని.. ఆభవనాలు రాష్ట్రమంతటా ఎందుకు ఇవ్వరని… ఎన్నికలొస్తే అబద్దాలు చెప్పాలి…గెలవాలి అన్న తీరు ఆ పార్టీదని ఈటల మండిపడ్డారు.
నాగార్జున సాగర్ లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఈటల ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ నాయకులను ప్రజలు ఈసడిచుకుంటున్నారని…వచ్చే ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టి ప్రతీకారం తీర్చుకుంటారని అన్నారు. 18 ఏళ్లు టీఆర్ఎస్ లో సైనికుడిలా పనిచేశానని….మీరు గోడలమీద, ఫ్లెక్సీలమీద ఉంటే…ప్రజల హృదయాల్లో తానుంటానని ఈటల వ్యాఖ్యానించారు.