యోగీ రెండోసారి సీఎం అయినా ప్రధాని అభ్యర్థిగా వెళ్తారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. యూపీకి తదుపరి సీఎంను నేనే అని శ్రీకృష్ణుడు కలలోకి వచ్చి చెప్పాడని అఖిలేశ్ అన్నారు. బీజేపీకి రాష్ట్ర ప్రజలు రాధే రాధే చెబుతారని అన్నారు. కోవిడ్ సమయంలో అన్ని సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అఖిలేష్ ఆరోపించారు. దానికి బీజేపీ నాయకులు సైతం ధీటుగానే బదులిచ్చారు.
కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో రాష్ట్రంలో లక్షలాది ఇమ్యూనిటీ కిట్లను పంపిణీ చేశారనే విషయం అఖిలేశ్ కు తెలియకపోవచ్చు. వలస కార్మికుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారని…కోవిడ్ వాక్సిన్ రాష్ట్రంలోని ప్రతీమూలకు చేరుకునేలా యూపీ సర్కారు ప్రచారం నిర్వహించిందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 5 వందలకు పైగా ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయని… మెడికల్ ఆక్సిజన్ సరిపడా లభ్యతలో ఉందన్నారు.
మరోసారి యోగీ గెలిస్తే…పదేళ్లపాటు అధికారంగా దూరంగా ఉన్న మీకు ప్రజల్లో పట్టు తప్పుతుంది కదా అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు అఖిలేశ్…’అప్పుడు యోగీ పీఎం అభ్యర్థి అవుతాడు.. బీజేపీ వాళ్లు ఆలోచించాలి. డబల్ ఇంజిన్ క్లాష్ అవుతుంది’ అని అన్నారు.
ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫిషన్ ఇప్పటికే వెలువడింది. ఫిబ్రవరి 10 నుంచి ఏడుదశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10న విడుదలవుతాయి.
https://twitter.com/IndiaToday/status/1480535223070691328?s=20
https://twitter.com/DDNewslive/status/1479726321458884615?s=20