ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం స్వీకారం చేయనున్నారు యోగీ ఆదిత్యనాథ్. ఈనెల 25న ముహూర్తం ఖరారైంది. లక్నోలోని భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఆరోజు సాయంత్రం 4 గంటలకు వేడుక జరగనుంది. 50 వేలమంది కూర్చునేందుకు వీలుగా స్టేడియం ఉంది.
403 మంది సభ్యుల యుపి అసెంబ్లీలో బిజెపి ఈసారి 255 స్థానాలను గెల్చుకుంది. మిత్రపక్షాలు మరో 18 సీట్లను దక్కించుకున్నాయి. గత ఎన్నికల ఫలితాలతో పోలిస్తే బీజేపీకి సీట్లు తక్కినా ఓట్లశాతం గణనీయంగా పెరిగింది.
కొత్త కేబినెట్ కూర్పుపై ఇప్పటికే రెండు దఫాలుగా నరేంద్రమోదీ, అమిత్ షా సహా ఇతర నేతలతో యోగి చర్చలు జరిపారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్యా సహా పది మంది మంత్రుల ఓటమితో ఈ సారి కొత్తవారికి స్థానం కల్పించనున్నారు. యోగీ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని తెలిసింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)