కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్లను చంపేస్తామంటూ ఓ మెయిల్ కలకలం రేపుతోంది. ముంబై నగరంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ సీఆర్పీఎఫ్కు మంగళవారం నాడు ఓ మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో ఉన్న సమాచారం చూసిన అధికారులు షాక్ తిన్నారు. అందులో యూపీ సీఎం యోగీతో పాటు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను చంపేస్తామంటూ పేర్కొన్నారు అపరిచితులు. అయితే వారిని ఎలా చంపేస్తామో అన్న విషయాన్ని కూడా పేర్కొనడం ఆందోళన రేపుతోంది. ఆత్మాహుతి దాడులు చేసి.. ఇరువురిని చంపేస్తామని అపరిచితుడు ఆ మెయిల్లో పేర్కొ న్నాడు. అంతేకాదు.. ప్రార్ధనా మందిరాలతో పాటుగా.. పలు ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా దాడులు చేస్తామని మెయిల్లో హెచ్చరికలు చేశాడు. ఆ అగంతకుడి మెయిల్పై సీఆర్పీఎఫ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా సీఎం యోగీ, కేంద్ర హోశాఖ మంత్రి అమిత్ షాల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
https://twitter.com/ANI/status/1379314990771884032