“లవ్ జిహాద్”కు చట్టంతో చెక్ పెట్టిన యోగీ సర్కార్.
దేశ వ్యాప్తంగా లవ్ జిహాద్ అనే అంశం కొద్ది రోజులుగా హాట్ టాపిక్గా మారింది. ప్రేమ పేరుతో అమాయక అమ్మాయిలను ట్రాప్ చేసి.. అనంతరం వారిని బలవంతంగా మతం మార్చుతూ.. వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న ఈ లవ్ జిహాద్ వల్ల అనేక మంది యువతులు మోసపోయారు. ముఖ్యంగా కేరళ,యూపీ,మధ్యప్రదేశ్లో లవ్ జిహాద్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఈ లవ్జిహాద్ అంశానికి చెక్ పెట్టేందుకు యోగీ సర్కార్ రెడీ అయ్యింది. సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత.. యూపీ అసెంబ్లీ చట్ట విరుద్దమైన ఈ మతమార్పిడి నిరోధక బిల్లు (లవ్జిహాద్)2021కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లును ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదంతో ఇది చట్టంగా రూపుదాల్చింది.
కాగా, లవ్ జిహాద్కు చెక్ పెట్టేందుకు తమ ప్రభుత్వం చట్టంతోనే ముందుకు వస్తుందని సీఎం యోగీ పలుమార్లు ప్రకటించారు. ఇదిలావుంటే.. అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి పలురాష్ట్రాలు ఇప్పటికే మతమార్పిడి (లవ్ జిహాద్) వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చాయి.