గత పోస్టుల్లో ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ గత 5 సం.లలో చేపడుతున్న అభివృద్ధి పనులు.. అంటే
1. 15 మెడికల్ కాలేజీలు +హాస్పిటల్స్ నిర్మించడం
2. పూర్వాంచల్ ఎస్ప్రెస్ హై వే నిర్మించడం
3. గోరకపూర్ AIIMS నిర్మించడం
4. బుందేల్ ఖండ్ ఎస్ప్రెస్ హై వే నిర్మాణం
5. గోరకపూర్ పూర్వాంచల్ ఎస్ప్రెస్ హై వే లింక్ ఎస్ప్రెస్ హై వే
6. గంగ ఏస్ప్రెస్ హై వే.
7. కాశీ విశ్వనాధ్ ధామ్ నిర్మాణం.
8. అర్జున్ సహాయక ఇరిగేషన్ ప్రాజెక్ట్
9. నోయిడాలో ఫిల్మ్ సిటీ గురించి చెప్పుకున్నాం.
ఇప్పుడు ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ హై వే గురించి చూద్దాం:
ఢిల్లీ మరియు దాని చుట్టుపక్కల నగరాలను అనుసంధానించడానికి నాలుగు ఎక్స్ప్రెస్వేల ఆలోచనను మొదటిగా 1999 లో ప్రతిపాదించారు. ఆ తరువాత ఏ కదలిక లేదు. మళ్ళీ 2005 లో ఘజియాబాద్ మరియు మీరట్ మధ్య రహదారి విభాగం 2011 నాటికి పూర్తి కావాలని ఎన్సిఆర్ (NCR) రవాణా ప్రణాళికలో నోటిఫికేషన్ ఇవ్వబడింది. కానీ అదీ ముందుకు వెనక్కి జరిగి 2014 వరకు పెద్దగా పట్టించుకోబడలేదు. అంటే ఈ ప్రోజెక్టు పై నిర్ణయం తీసుకోవడానికి సుమారు 14 సం. లు సమయం పట్టింది. ఉత్తరప్రదేశ్ లో కూడా భూసేకరణ జరగాలి కాబట్టి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కలసి ముందుకు సాగాలి.
చివరగా, 2014 లో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) రోడ్ల నిర్మాణానికి పచ్చజెండా వేసింది. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 31, 2015 న పునాది వేశారు.
2018 మేలో ఎక్స్ప్రెస్వే మొదటి దశను ప్రారంభించారు.
ఇది పేరుకు 96కి.మీ హై వే అయినా కొన్ని చోట్ల 14 లేన్లు ఉన్నాయి, కొన్ని చోట్ల 8లేన్లు (సాధారణ హై వే 4 లేన్లు ఉంటుంది) కాబట్టి మామూలు హైవే కంటే 2 రెట్లుకు పైగా ఎక్కువగా నిర్మించారు.
ఘజియాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో రైతుల నిరసనల వల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణం కొత్త ఆలస్యం అయింది.
అంటే 1999 సం.లలో అనుకున్న ఇంత ముఖ్యమైన హైవే ప్రొజెక్టు 2014 వరకు కదలిక లేదు. మోడీ ప్రభుత్వం 2015లో పునాది రాయి వేసి 2017లో యోగి.ప్రభుత్వం వచ్చాక భూ సేకరణ ఊపు అందుకొని, 2021 ప్రారంభంలోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రారంభించారు.
ఇక ఈ హై వే గురించి చూద్దాం :
దేశంలోనే మొట్టమొదటి 14 లేన్లు ఉన్నది ఈ ఢిల్లీ నుండి మీరట్ ఎక్స్ప్రెస్ హైవే.
96 కిలోమీటర్ల పొడవున్న ఈ 14 లేన్ల ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వే ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయం 2.5/3.00 గంటల నుండి 45 నిమిషాలకు తగ్గిస్తుంది.
ప్రస్తుతం మీరట్ నుండి వచ్చే ప్రయాణికులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి NH-58 ను వాడుతూ 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికే మూడు గంటలు పడుతొంది. ఈ ఎక్స్ప్రెస్వే ముజఫర్ నగర్, సహారాన్పూర్, హరిద్వార్ మరియు డెహ్రాడూన్ నుండి ప్రయాణం చేసే వారి సమయాన్ని బాగా తగ్గిస్తుంది.
ఈ ఎక్స్ప్రెస్వేలో 14 లేన్లు ఉంటాయి, వాటిలో ఆరు మీరట్ వరకు సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే ను కలిగి ఉంటాయి, బయటి వైపు నాలుగు లేన్లు హైవే లేన్లుగా ఉంటాయి.
Courtesy : Chada Sastry




