గత పోస్టుల్లో ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ చేపడుతున్న అభివృద్ధి పనులు.. అంటే
1. 15 మెడికల్ కాలేజీలు/హాస్పిటల్స్ నిర్మించడం
2. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హై వే నిర్మించడం
3. గోరకపూర్ AIIMS నిర్మించడం
4. బుందేల్ ఖండ్ ఎస్ప్రెస్ హై వే నిర్మాణం
గురించి చెప్పుకున్నాం.
ఇప్పుడు గోరకపూర్ పూర్వాంచల్ లింకు ఎక్స్ప్రెస్ హై వే 92 కి.మీ లింక్ ఎక్స్ప్రెస్ వే గురించి చూద్దాం.
మరియు 594 కి.మీ మీరట్-ప్రయాగ్రాజ్ గంగ ఎక్స్ప్రెస్ హై వే ల గురించి తెలుసుకుందాం.
గోరకపూర్ లింక్ ఎక్స్ప్రెస్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2018 లో ప్రకటన చేశారు. భూసేకరణ ఫిబ్రవరి 2019 లో ప్రారంభమైంది. భూ సేకరణ వ్యయంతో సహా గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్వే మొత్తం ప్రాజెక్ట్ విలువ ₹ 5,876 కోట్లు .
ఈ లింక్ ఎక్స్ప్రెస్వే గోరఖ్పూర్ బైపాస్ నుండి ఆజంగఢ్ జిల్లా లో సలార్పూర్ అనే గ్రామం దగ్గర ఇప్పటికే నిర్మించి ప్రారంభించబడిన పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే లో కలుస్తుంది. ఇది ఉత్తర ప్రదేశ్లోని 4 జిల్లాల గుండా వెళుతుంది , అంటే గోరఖ్పూర్ , సంత్ కబీర్ నగర్ , అంబేద్కర్ నగర్ మరియు అజంగఢ్ .
ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 1,095 హెక్టార్ల భూమి సేకరణ జరుగుతుంది. దీనిలో 2 టోల్ ప్లాజాలు , 3 ర్యాంప్ ప్లాజాలు, 7 ఫ్లైఓవర్లు, 7 పెద్ద వంతెనలు, 27 చిన్న వంతెనలు, 16 వాహన-అండర్పాస్లు, 50 లైట్ లు మరియు 35 పాదచారుల అండర్పాస్లు కూడా నిర్మించబడతాయి.
91.352 కి.మీ పొడవైన గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్వే నిర్మాణ పనులు 2 ప్యాకేజీలుగా విభజించబడ్డాయి. 2019 ఫిబ్రవరి నుండి భూసేకరణ మొదలు అయి అక్టోబర్ కి 50% పైగా సేకరించిన తరువాత నిర్మాణ పనులు కాంట్రాక్టు లు ఇచ్చారు. 2020 లో కోవిద్ పనులు ఆలస్యం అయినా మార్చ్ 2021 సుమారు మొత్తం భూసేకరణ జరిగింది.
ప్రస్తుతానికి మొత్తం పనులలో 30% వరకు నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. డిసెంబర్ 2023 కి పూర్తి అయ్యే టార్గెట్ ఉన్నా 9 నెలల ముందే మార్చి 2023కి పూర్తి అవుతుంది అని అంచనా.
ఈ మధ్యనే గోరఖ్ పూర్ లో AIIMS ఆసుపత్రి కట్టారు కాబట్టి ఈ నాలుగు జిల్లాల గ్రామీణ ప్రజలు వేగంగా గోరేఖ్ పూర్ చేరుకోడానికి ఈ ఎస్ప్రెస్ హై వే బాగా ఉపయోగపడుతుంది.
అలాగే ఈ ప్రాంత రైతులు ఇప్పుడు నేరుగా తమ గ్రామాల నుండి ఈ ఎస్ప్రెస్ హై వే పట్టుకుని పూర్వాంచల్ ఎస్ప్రెస్ హై వే ద్వారా ఇటు లక్నో గాని అటు ఢిల్లీ కానీ చేరుకోవచ్చు.
మీరట్-ప్రయాగ్రాజ్ గంగ ఎస్ప్రెస్ హై వే :
————————————————–
ఈ ఎక్స్ప్రెస్ హై వే కాకుండా యోగి ప్రభుత్వం,
మీరట్ నుండి ప్రయాగ్రాజ్ వరకు “గంగ ఎక్స్ప్రెస్” హై వే నిర్మించడానికి పూనుకుంటోంది. ఇది 2007 లో మాయావతి ముఖ్యమంత్రి గా ఆమె తలపెట్టారు. కానీ రకరకాల అడ్డంకులు వల్ల అంటే భూసేకరణ, పర్యావరణం మొ. కారణాల వల్ల పని మొదలుకాలేదు. ఆ తరువాత వచ్చిన అఖిలేష్ ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టలేదు.
ఈ గంగ ఎక్స్ప్రెస్ హై వే 584 కి.మీ, 12 జలాల గుండా వెళుతుంది. దీనిని మొదట్లో గంగానది ఒడ్డుగా కడదామని అనుకుని మళ్లీ పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని గంగ నదికి 10 కి.మీ దూరంలో సమాంతరంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హై వే కాక ఢిల్లీ వెళ్ళడానికి ఇది మరో మార్గం చూపుతుంది. భూ సేకరణ ఖర్చుతో కలిపి దీని మొత్తము ప్రాజెక్ట్ కాస్ట్ 37,500 కోట్లుగా అంచనా వేశారు.
ఈ మొత్తం పని 12 ముక్కలుగా విడగొట్టి నిర్మాణ కాంట్రాక్టు పనులు ఇచ్చారు.. ఈ హై వే కోసం సుమారు 6,600 ఎకరాల భూమి సేకరిస్తున్నారు. పూర్తి భూసేకరణ పని రమారమి పూర్తి అయింది. నిర్మాణ పనులు మొదలు అవుతున్నాయి.
ఒక్క సంగతి అర్ధం కావడం లేదు. దేశంలో ఎక్కడ భూసేకరణ చేద్దాం అనుకున్నా బోలెడు అడ్డంకులు ఎదురవుతున్నాయి మరి ఇన్ని ప్రాజెక్ట్ ల కోసం ఇన్ని వేల ఎకరాల భూమి ఏ అడ్డంకులు లేకుండా అంత త్వరగా త్వరగా ఎలా సేకరిస్తున్నారో యోగి?
Courtesy : Chada Sastry





