నిజాయితీ, చిత్త శుద్ధి ఉంటే ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రిగా ఎంత అభివృద్ధి చెయ్య వచ్చో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆడిత్యనాధ్ గారు ఉదాహరణ. సాధారణంగా ముఖ్య మంత్రికి పనిచేసే కాలం 4 సం..లు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ముందు 6 నెలలు కుదురుకోవడానికి, చివరి 6 నెలలు మళ్ళీ ఎన్నికలకు తయారు అవ్వడానికి వేస్ట్ అయిపోతాయి. కానీ యోగి దురదృష్టం ఏమిటంటే పోనీ ఈ 4 సం. లు కాలం అయినా పూర్తిగా లభించిందా అంటే కరోనా వల్ల మధ్యలో సుమారు 15 నెలలు లాక్ డౌన్లు, ఆంక్షలు తో పూర్తి సమయం లభించలేదు. అయినా దొరికిన సుమారు ఈ 3 సం. ల కాలంలో ఉత్తరప్రదేశ్ లో అద్భుతాలు సృష్టించారు… అవి ఏం అభివృద్ధి పనులో మీరు తెలుసుకుంటే ఆశ్చర్యానికి లోను అవుతారు. కానీ ఆయన కాషాయ బట్టలు వేసుకుంటాడు అని మన ఉదారవాదులకు, చైనా ప్రేమికులకు ఒళ్ళు మంట.
ఈ రోజు నుండి నేను రోజుకి ఒకటి చొప్పున యోగి తన పాలనలో పూర్తి చేసిన అభివృద్ధి పనులు వివరాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను.
ఈ రోజు #పూర్వాంచల్ఎస్ప్రెస్వే
UPEIDA (ఉత్తరచల్స్ప్రెస్వేప్రదేశ్ ఎక్స్ప్రెస్ హైవేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ) ద్వారా 340.82 కిమీ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే ప్రాజెక్ట్ నిర్మించాలని యుపి ప్రభుత్వం 2015లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఉన్నప్పుడే అనుకుంది. దీనిని 6 లేన్స్ యాక్సెస్-నియంత్రిత రహదారిగా లక్నో జిల్లాలోని చాంద్ సరాయ్ గ్రామం నుండి ఘాజీపూర్ జిల్లాలోని హైదరియా గ్రామం వరకు ప్లాన్ చేశారు.
ఈ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ మొదట మే 2015లో లక్నో – అజంగఢ్ – బల్లియా ఎక్స్ప్రెస్వేగా ప్రకటించబడి భూసేకరణ ప్రారంభమైంది. కానీ 2017లో యోగి ప్రభుత్వం వచ్చేసరికి 25% భూసేకరణ కూడా జరగలేదు. యోగి వచ్చిన వెంటనే 90% వరకు భూసేకరణ పూర్తిచేసి జూలై 2018లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేత శంకుస్థాపన చేయించారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ 8 సివిల్ ప్యాకేజీలుగా విడగొట్టి 5 మంది కాంట్రాక్టర్లు కు ఇచ్చి అక్టోబర్ 2018లో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తి చేయడానికి 36 నెలల గడువు ఇచ్చారు నిర్మాణ సంస్థలకు.
మొత్తం అంచనా వ్యయం : రూ. 22,494 కోట్లు
గడువు తేదీ : అక్టోబర్ 2021
ప్రాజెక్ట్ మొత్తం పొడవు : 340.824 కి.మీ
రోడ్డు వెడల్పు : 6 దారులు
ఈ ఎక్స్ప్రెస్వే ఈ రోజూ అంటే నవంబర్ 16 తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. నేడు ప్రారంభం అయ్యేసరికి మొత్తం ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. మొత్తం 934 నిర్మాణాలు అంటే బ్రిడ్జిలు, అండర్ పాస్ లు మొదలగునవి ఈ రూట్ లో కట్టారు.
ఈ ఎక్స్ప్రెస్వే లక్నో, బారాబంకి, సుల్తాన్పూర్, అయోధ్య, అంబేద్కర్ నగర్, అజంగఢ్, మౌ మరియు ఘాజీపూర్ జిల్లాలను కలుపుతుంది.
ఈ రోడ్ మీద సుల్తాన్ పూర్ జిల్లా దగ్గర ఒక 3.3 కి.మీ ఎయిర్ స్ట్రిప్ కూడా నిర్మించారు. యుద్ధ సమయాల్లో అవసరం అనుకుంటే యుద్ధ విమానాలు ఈ రోడ్డు మీద నేరుగా దిగ గలిగే అంత నాణ్యత తో ఈ ఎయిర్ స్ట్రిప్ నిర్మించారు.
ఈ హై వే ప్రారంభోత్సవానికి నేడు మోడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో ఈ రోడ్డు మీద నేరుగా దిగుతారు. అంతే కాక ఈ ప్రారంభ రోజు భారత యుద్ధ విమానాలు సుకోయ్, మిరేజ్ లు కూడా ఈ ఎయిర్ స్ట్రిప్ మీద పలు సార్లు ల్యాండ్ అయి, టేక్ ఆఫ్ చేసి దీని నాణ్యత పరీక్షిస్తాయి.
Courtesy : Chada Sastry