మహారాష్ట్రలో మొదలైన లౌడ్ స్పీకర్లు, మైకుల చర్చ యూపీకి పాకింది. ప్రార్థనాస్థలాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని, అలాగే ఎక్కడపడితే అక్కడ ప్రార్థన చేయకూడదనే డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై సీఎం యోగీ స్పందించారు.
మత పరమైన విధానాలకు అనుగుణంగా ఆరాధనా పద్ధతులను అనుసరించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని అయితే నిర్ధారించిన ప్రాంతాల్లో మాత్రమే మతపరమైన కార్యక్రమాలు, ఆరాధనలు జరుపుకోవాలని, ట్రాఫిక్కు అంతరాయం కలిగించరాదని అన్నారు. అలాగే ప్రార్థనా స్థలాల్లో మైకులు వాడవచ్చని, అయితే మైకుల శబ్దం మాత్రం ఆ ఆవరణ దాటి బయటకు పోరాదని అన్నారు. మైక్లకు కొత్తగా పర్మిషన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేసిన యోగి ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడడం అందరి బాధ్యత అని అన్నారు.