ఒక సద్భావనతో హరిద్వార్ పట్టణంలో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అలకనంద హోటల్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అప్పగించింది యూపీ. రెండు దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదంలో ఉన్న అలకనంద హోటల్ను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ఉత్తరాఖండ్ కు అప్పగించారు. 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, ఆ ప్రభుత్వం అలకనంద గెస్ట్హౌస్పై దావా వేసింది. అయితే ఉత్తరప్రదేశ్ గెస్ట్ హౌస్ను అలాగే ఉంచుకుంది. ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఇరు రాష్ట్రాలు సమస్యను పరిష్కరించుకున్నాయి.
రాష్ట్రం నుంచి ఉత్తరాఖండ్కు వెళ్లే అతిథులకు వసతి కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హరిద్వార్లో 100 గదుల భగీరథి టూరిస్ట్ గెస్ట్ హౌస్ను నిర్మించింది. రెండు పొరుగు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తుల పంపిణీ సమస్యను పరిష్కరించేందుకు యూపీ ప్రభుత్వం అలకనంద అతిథి గృహాన్ని ఉత్తరాఖండ్కు అప్పగించింది. ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన నాటి నుంచి గత 21 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న చాలా వరకు ఆస్తుల వివాదాలను ఇప్పటికే ఇరు రాష్ట్రాలూ కలిసి పరిష్కరించుకున్నాయి.
https://twitter.com/ANINewsUP/status/1522101922777694210?s=20&t=iZqZ9hLhusZX06nVKE5n_w
“అలకనంద గెస్ట్హౌస్ సమస్య చాలా కాలంగా కోర్టులో పెండింగ్లో ఉందని.. అయితే యూపీ, ఉత్తరాఖండ్లు పరస్పర అవగాహనతో సమస్యను పరిష్కరించుకున్నాయని, దీని ప్రకారం అలకనంద హోటల్ను ఉత్తరాఖండ్కు అప్పగిస్తామని.. బదులుగా పర్యాటకుల కోసం ఒక గెస్ట్హౌస్ను నిర్మించడానికి ఆ రాష్ట్రం యూపీకి భూమిని కేటాయిస్తుంది” అని యోగి చెప్పారు.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్య 95 శాతం ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యాయని, అయితే నీటిపారుదల భూములు, డ్యామ్ల విషయంలో ఇంకా 5 శాతం వివాదాలు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు.