ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిప్పులు కక్కారు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలకు గూబ గుయ్యమని పోయేలా పంచ్ లు విసురుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ లో ఎక్కువ ఎంపీ సీట్లు సాధించే విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బిజెపి అభ్యర్థులను వెంటబెట్టుకుని సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయాన్ని కదిలించవద్దని కాంగ్రెస్ నేతలు పదే పదే చెబుతున్నారు. మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ మరో అడుగు ముందుకేసి పిఓకే విషయం కదిలించినట్లయితే.. పాకిస్తాన్ కు కోపం వస్తుందని వెల్లడించారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని,, అటువంటి దేశంతో మర్యాదపూర్వకంగానే నడుచుకోవాలని మణిశంకర్ అభిప్రాయపడ్డారు. మణిశంకర్ అయ్యర్ మాటల్ని కాంగ్రెస్ నేతలు ఖండించడం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే మణిశంకర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీవే అన్న భావన కలుగుతోంది. మైనార్టీ ఓట్ల కోసం కొంతకాలంగా కాంగ్రెస్ నేతలు, కమ్యూనిస్టులు పోటీపడి పాకిస్తాన్ ను పొగుడుతూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. మన దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయని,, దేశ ప్రజలు భయపడాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు . మన దేశం దగ్గర కూడా శక్తివంతమైన అణుబాంబులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. మన దగ్గర ఉండే బాంబులు ఫ్రిజ్లో దాచుకునేవి కావని,, అవసరమైతే ప్రళయం సృష్టించగల శక్తివంతమైన బాంబులని ఆయన అన్నారు.
అమేథీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. ఆమెను వెంటబెట్టుకుని యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమేథీలోనే సైనిక బలగాలకు అవసరమైన బాంబులు తయారవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. అదే మాదిరిగా దేశద్రోహుల్ని తరిమికొట్టే ఓటు అనే బాంబుని అమేథీ ప్రజలు ఉపయోగించాలని ఆయన కోరారు. ఈ బాంబుతో కాంగ్రెస్ కమ్యూనిస్టుల్ని తరిమి తరిమి కొడదామని ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.
మరోవైపు అమేథీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు ప్రియాంక గాంధీ విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో అక్కడ పోటీ తీవ్రంగా మారింది కాంగ్రెస్ కుటుంబానికి కంచుకోట అయిన అమేధీలో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ ఓడించారు. మరి ఈ ఏడాది ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.