అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నేపాల్లో ఘనంగా నిర్వహించారు. రాజధాని ఖాట్మండులో పెద్దఎత్తున యోగా డే వేడుకలు జరిగాయి. ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ సందేశాన్ని హైలైట్ చేశారు. కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి జ్ఞానేంద్ర బహదూర్ కర్కీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు.
యోగాడేకు ఒకరోజు ముందుగానే నేపాల్లోని ఇండియన్ మిషన్ ఆధ్వర్యంలోని స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్ లైటింగ్ ఉత్సవాలు నిర్వహించింది.