
Haryana Chief Minister Manohar Lal Khattar
కర్నాటక బాటలో హర్యానా సర్కారు వెళ్తోంది. బలవంతపు మతమార్పిడిలకు అడ్డుకట్ట వేసేలా… కీలక చట్టం తీసుకువచ్చింది మనోహర్ లాల్ కట్టర్ ప్రభుత్వం. ‘హర్యానా ప్రివెన్షన్ ఆఫ్ అన్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రెలిజన్ బిల్లు- 2022’ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా సరే బలవంతపు మత మార్పిడికి పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. చట్టం ప్రకారం నిందితుడే తాను నిర్దోషి అని కోర్టులో నిరూపించుకోవాల్సిఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించింది వీహెచ్పీ. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ద్వారా సర్కారు సత్తా చాటిందని వీహెచ్పీ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ అన్నారు. చట్టంగా మారిన వెంటనే రాష్ట్రంలో పెరుగుతున్న లవ్ జిహాద్, మతమార్పిళ్లను అరికట్టాలని ఆయన కోరారు. కొంతకాలంగా హర్యానాలో మతమార్పిడి ఎక్కువైంది. కొందరు బలవంతంగా మతంమారుస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. దీంతో వాటికి అడ్డుకట్టవేసేందుకు చట్టంరూపొందించింది ప్రభుత్వం. చట్టం అమల్లోకి వస్తే సమస్యలు తొలగుతాయని…సామాజిక సామరస్యం. శాంతియుత వాతావరణం రాష్ట్రంలో నెలకొంటాయని ప్రభుత్వం భావిస్తోంది.