నెహ్రూ-గాంధీ కుటుంబానికి తాము బానిసలమని.. చివరి శ్వాస వరకు వారికి బానిసలుగా ఉంటామని సిరోహి ఎమ్మెల్యే సన్యామ్ లోధా రాజస్థాన్ అసెంబ్లీలో సగర్వంగా ప్రకటించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సలహాదారుగా పనిచేస్తున్న లోధా రాజస్థాన్ అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సెషన్లో మాట్లాడారు. ఆయన హరిదేవ్ జోషి యూనివర్శిటీ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ సవరణ బిల్లుపై మాట్లాడుతూ, “అవును మేము నెహ్రూ-గాంధీ కుటుంబానికి బానిసలం.. మా చివరి శ్వాస వరకు మేము వారికి బానిసలుగా ఉంటాము. దేశాన్ని నెహ్రూ-గాంధీ కుటుంబం నిర్మించింది. కాబట్టి వారి కుటుంబానికి తాము బానిసలుగా మిగిలిపోతాం” అని అన్నారు.
అతని మాటల కారణంగా బీజేపీ నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది.
ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్ మాట్లాడుతూ, “ఇది కొత్త సంస్కృతి, మీ బానిసత్వానికి అభినందనలు. మీరే బానిసలుగా ఉన్నారు.. ఇక మీరు సమాజానికి ఏం సందేశమిస్తారు. బానిసలు ఎప్పుడూ కూడా తమ మనసులోని మాటలను చెప్పలేరు” అని అన్నారు.
ఇరువర్గాల మధ్య వాగ్వాదం అసెంబ్లీలో గందరగోళానికి దారితీసింది. దాంతో స్పీకర్ జోక్యం చేసుకుని సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నించారు.
https://twitter.com/aashishNRP/status/1506219743560159237?s=20&t=Tbur47mfRUEdgeVx_Aluvg
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)