కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తన కుమారుడు బీవై విజయేంద్ర వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో పోటీ చేస్తారని ప్రకటించారు. తన కుమారుడికి అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
“విజయేంద్రకు ఓటు వేసి పెద్ద సంఖ్యలో గెలిపించాలని నేను షికారిపూర్ ప్రజలను అభ్యర్థిస్తున్నా. ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో ఆయన్ని పోటీ చేయమంటున్నారు. కానీ నేను షికారిపూర్ స్థానంలో పోటీ చేయనందున విజయేంద్ర ఆ స్థానం నుంచి పోటీ చేస్తాడు” అని యడియూరప్ప అన్నారు.
అంతకుముందు, జూన్లో జరిగిన శాసన మండలి ఎన్నికలకు విజయేంద్రకు బీజేపీ టిక్కెట్ నిరాకరించింది.
“భవిష్యత్తులో విజయేంద్రకు మరిన్ని అవకాశాలు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నామని.. ప్రతిభ, అంకితభావం ఉన్న వ్యక్తులను పార్టీ వదులుకోదని.. 2023లో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని.. ఆ దిశగా అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని యడ్యూరప్ప అప్పుడే చెప్పారు.
యడ్యూరప్ప తన కుమారుడిని ఎమ్మెల్సీని చేయాలని కోరుకున్నారని, ఆ తర్వాత బసవరాజ్ బొమ్మై మంత్రివర్గంలో మంత్రిని చేయాలని పట్టుబట్టారని వార్తలు వచ్చాయి.