ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసిపి పార్టీకి, ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి మధ్య పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఇందులో రెండువైపులా సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. అన్ని నియోజకవర్గాల్లోనూ తీవ్రంగా పోటీ జరిగింది. చాలా చోట్ల అతి తక్కువ మెజార్టీతోనే గెలుపు ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇక్కడే మరో కీలక విషయం బయటపడుతుంది ఆంధ్రప్రదేశ్ అంతట ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ప్రభుత్వం మీద తీవ్ర కోపం ఉంది. దీంతో పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఆయా వర్గాలు ఉపయోగించుకున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా సంపాదించి నూరు శాతం దాకా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇదంతా తెలుగుదేశం కూటమికి కొత్తగా పడిపోయాయి అని చెబుతున్నారు. దీంతో పోరాటం తీవ్రంగా జరిగి. ఒకటి రెండువేల ఓట్ల తేడాతోనే నియోజకవర్గంలో గెలుపు ఖరారు అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు.. ఈ పోస్టల్ బ్యాలెట్ ల సహాయంతో తెలుగుదేశం గెలిచిపోతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. అటువంటి అప్పుడు వైసీపీకి గడ్డు పరిస్థితి తప్పక పోవచ్చు.
ఓట్ల లెక్కింపు రోజు కూడా పోస్టల్ బ్యాలెట్లు ప్రభావం చూపుతాయి.
జూన్ 4 ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఏపీ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలలో కూడా శరవేగంగా ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈసారి పోలింగ్ లో ఒక కీలక డెసిషన్ తీసుకోబోతున్నారు. అదేంటి అంటే పోస్టల్ బ్యాలెట్ ని మొదట లెక్కించడం. సాధారణంగా కూదా అదే జరుగుతుంది. కానీ ఈసారి మరింత ఫోకస్డ్ గా దీని మీద ఈసీ దృష్టి పెట్టడానికి కారణం పోస్టల్ బ్యాలెట్ కూడా ఆషామాషీ రికార్డు క్రియేట్ చేయలేదు. ఏకంగా కొన్ని జిల్లాలలో అయితే నూరు శాతం కూడా ఓటింగ్ నమోదు అయింది.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టడానికి ప్రత్యేకంగా టేబిల్స్ వేసి మరీ ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఏకంగ అయిదు లక్షల దాకా పోస్టల్ బ్యాలెట్ పోల్ అయింది ఈసారి అని అంటున్నారు. సాధారణ ఎన్నికలతో పాటుగానే వాడిగా ఇది జరిగింది అని చెబుతున్నారు. దీంతో మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించి ఆ మీదట సాధారణ ఓట్లను లెక్క పెడతారు అని అంటున్నారు పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువ శాతం ఓట్లు ఎవరికి పడ్డాయి అంటే…కూటమికి అని అనధికారికంగా ప్రచారం సాగుతోంది. ఉద్యోగులు ఉపాధ్యాయులు వివిధ వర్గాలు సర్కార్ మీద ఆగ్రహంగానే ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేశారు అని అంటున్నారు. అదే జరిగితే మాత్రం వైసీపీకి బిగ్ షాక్ అని అంటున్నారు.
మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడి అయిపోయినప్పుడు సహజంగానే రాష్ట్రమంతా తెలుగుదేశం కూటమి ఆధిక్యతలో ఉంది అన్న టాకు ప్రచారం అయిపోతుంది ఇది టిడిపి కూటమి లో ఉత్సాహాన్ని పెంచితే ,, వైసీపీ క్యాడరుకు నిరుత్సాహం తీసుకొస్తుంది. దీంతో కౌంటింగ్ రోజు చివరి గంట దాకా అప్రమత్తంగా ఉండాల్సిన వైసీపీ క్యాడరు డీలా పడవచ్చు. ఎన్నికల మేనేజ్ మెంట్ లోఅన్ని విషయాలు ముఖ్యమే. అటువంటప్పుడు టిడిపి కూటమి దూకుడుగా వ్యవహరించి ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
ఒక అంచనా ప్రకారం చూస్తే నూటికి ఎనభై అయిదు శాతం ఓట్లు కూటమికి పడ్డాయని అంటున్నారు. అంటే ఇది భారీగా వైసీపీకి నష్టం గా మారే అంశం. ఇక ఉదయాన్నే కౌంటింగ్ ప్రారంభం అయితే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే మెజారిటీలు అన్నీ భారీ ఎత్తున కూటమికే వస్తాయని అంటున్నారు. దాదాపుగా నూటికి తొంబై శాతం నియోజకవర్గాల్లో తొలి ట్రెండ్స్ లోనే కూటమి ఆధిక్యతను గట్టిగా చాటి చెబుతాయని అంటున్నారు. ఇక ఒక్కో జిల్లాలో సగటున ఏకంగా ముప్పై వేల దాకా పోస్టల్ బ్యాలెట్ పడింది. అంటే జిల్లాలో ఎవరేజ్ న పది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే మూడు వేల ఓట్లు తక్కువ కాకుండా పోస్టల్ ఓట్లు జత కలుస్తాయన్న మాట. ఈసారి హోరా హోరీ పోరుగా సాగిన సంగతి విధితమే
అలాంటపుడు నూటికి ఎనభై అయిదు శాతం ఓట్లు కూటమికి పడాయని ప్రచారం సాగుతోంది. చాలా చోట్ల వేయి అయిదు వందల ఓట్లతో కనుక గెలుపు ఓటములు సాగితే మాత్రం ఈ పోస్టల్ బ్యాలెట్ అక్కడ ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది అని అంటున్నారు. ఆ విధంగా మొత్తానికి మొత్తం ఫలితాన్నే చేంజ్ చేసే సత్తా పోస్టల్ బ్యాలెట్ కి ఈసారి ఉంది అని అంటున్నారు. దాంతో ఇపుడు ఎవరైనా భారీ మెజారిటీలు అంటే పది వేలకు పై చిలుకు ఓట్లు సాధిస్తేనే తప్ప పోస్టల్ బ్యాలెట్ ప్రభావాన్ని తప్పించుకోలేరు అని అంటున్నారు.
తొలి ట్రెండ్స్ టీడీపీ కూటమికి అనుకూలంగా రావడం అంటే జూన్ 4 తొలి గంటలల్లోనే ఏపీలో విపక్షం సంతోషాన్ని ఎవరూ ఆపలేరని అంటున్నారు. మధ్యాహ్నానికి ఫలితం తుది రూపు తెలియవచ్చు. అపుడు ఈ తొలి ట్రెండ్స్ ఓట్లు ఎంత మేరకు గెలుపుని శాసిస్తాయో చూసిన మీదట ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో విజేత నిర్ణయం అవుతారు. అంతవరకూ మాత్రం కూటమి ఆనందాన్ని జోష్ ని ఎవరూ ఆపలేరు అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే పోస్టల్ బ్యాలెట్ ప్రభావం వైసిపికి షాక్ ఇవ్వడం ఖాయం. పైగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును సరళ తరం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా నిర్ణయించారు. వాస్తవానికి పోస్టల్ బ్యాలెట్ మీద గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ కొట్టాలి. అటువంటి లాంఛనం లేకపోయినా.. ఆ ఓటుని అంగీకరించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు
ఈ నిర్ణయం తెలుగుదేశం నెత్తిన పాలు పోసినట్లు అయింది. దీని మీద వైసిపి వర్గాలు మండిపడుతున్నాయి మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్ తడాఖా తెలుసుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది.