వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అభ్యర్థుల పేర్లనుప్రకటించారు. మొత్తం 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. అభ్యర్థుల్లో బీసీ 11, ఓసీ 4, ఎస్సీ 2, ఎస్టీ 1 ఉన్నారు. స్థానిక సంస్థల కోటాలో 9 మంది, ఎమ్మల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అభ్యర్థుల వివరాలు… నార్తు రామారావు, కుడిపూడి సూర్యనారాయణ,వెంక రవీంద్రనాథ్, కావూరు శ్రీనివాస్ , మేరుగ మురళీధర్, సిపాయి సుబ్రహ్మణ్యం, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి , మధుసూదన్,ఎస్.మంగమ్మ. ఇక ఎమ్మెల్యే కోటా అభ్యర్థులుగా పెన్మత్స సూర్యనారాయణరాజు ,పోతుల సునీత, కోలా గురువులు,
బొమ్మి ఇజ్రాయిల్ , జయమంగళ వెంకటరమణ , చంద్రగిరి ఏసురత్నం ,మర్రి రాజశేఖర్ పేర్లు ఖరారు చేయగా గవర్నర్ కోటా అభ్యర్థులుగా కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీ పేర్లను ప్రకటించింది పార్టీ.