మత విస్తరణ, దాని ద్వారా రాజ్య విస్తరణ ఆకాంక్ష గల అబ్రాహామిక్ మతాలైన క్రిస్టియానిటి మరియు ఇస్లాం మతాల దాష్టీకానికి ప్రపంచంలో చాలా పురాతన మతాలు, ప్రార్థనా పద్దతులు, సంస్కృతులు కనుమరుగు అయిపోయాయి.

తమ ప్రాచీన విశ్వాసాల మీద నమ్మకం ఉన్న ఏ కొద్ది సమూహాలో వారి పద్దతులు పాటించుకుంటూ, నివసించే అవకాశం వుంటే వారి స్వస్థలాలలోనే భయం భయంగా బతుకులు ఈడుస్తున్నారు. కొన్ని సమూహాలు అంటే కొంత మంది పారసీలు వంటి వారు వారి స్వస్థలాల నుండి పారిపోయి శాంతి సర్వమత సమ భావన మెండుగా గల భారత దేశం వచ్చి బతుకుతున్నారు.
ఇలా మత మౌఢ్య హింసకు తర తరాలుగా గురి అవుతూ మిగిలిన వున్న మరో ఒక చిన్న మత సమూహమే ఈ “యజదీలు”. వీరి సంఖ్య మొత్తంగా 10 లక్షల లోపే వుంటుంది అని ఒక అంచనా. వీరు ప్రస్తుతం ఎక్కువగా అంటే సుమారు 5 లక్షల వరకు ఉత్తర ఇరాక్ లో నైన్వే, దోహుక్ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇస్లామిక్ తీవ్రవాదులకు భయపడి మిగతా వారు జర్మనీ, బెల్జియం, అమెరికా మొదలగు దేశాలకు వలస పోయారు.
చారిత్రాత్మకంగా తప్పుగా అర్ధం చేసుకున్న ఒక మత సమూహం ఈ “యాజిదీలు”. వీరు ప్రధానంగా జాతిపరంగా కుర్దిష్ గా చెప్పబడతారు.

ఇది కూడా ఒక ప్రాచీన మతం. 11 వ శతాబ్దపు ఉమ్మయ్యద్ షేక్ చేత స్థాపించబడినట్లుగా చెప్పబడుతోంది. ఇది జొరాస్ట్రియనిజం(పార్శీ) క్రైస్తవం మరియు ఇస్లాం ల విశ్వాసాల నుండి ఉద్భవించింది. క్రైస్తవ, ఇస్లాం మతం నుండి సున్తీ పద్ధతిని, అగ్నిని దేవుడిగా గౌరవించడం అన్నది జొరాస్ట్రియనిజం నుండి తీసుకుంది. కానీ అబ్రహం మతం కానిదిగా చెప్పబడుతోంది. ఈ వైవిద్యమే “యాజిదీలను” ఒక ప్రత్యేక శాఖగా గుర్తించడానికి దారితీసింది.

యాజిదీలపై ద్వేషానికి ముఖ్య కారణం వారు తిరస్కరించబడిన దేవదూత ‘మెలెక్ తవుస్’ లేదా నెమలి దేవదూతను ఆరాధించడం. వారు ప్రాధాన్యతను ఇచ్చే ఏడు దేవదూతలలో ఇతను ఒకరు. జూడియో-క్రిస్టియన్ సంప్రదాయంలో సాతాను లాగా బహిష్కరింపబడకుండా ఈ మెలెక్ తవుస్ అనే దేవదూత క్షమించబడి స్వర్గానికి తిరిగి తీసుకోవటం జరిగింది. యాజిదీలు ఈ ‘మెలెక్ తవుస్’ ని ఆరాధించడంతో వీరిని “డెవిల్” లేక “సాతాను-ఆరాధకులుగా” గుర్తించబడడమే వారికి ప్రాణాంతకంగా పరిణమించింది.
ఈ ఆరాధన ను ఇస్లాం కి వ్యతిరేకం అని ముద్ర వేసి 18, 19 వ శతాబ్దాలలో మొదట్లో మతమౌడ్య ఇస్లాం పాలకుల చేతుల్లో 72 భయంకర మారణకాండలలో వేలమంది ఏజిధీలు హతం అయితే ఆధునిక కాలంలో అల్ ఖైదా, ఇసిస్ వంటి ఇస్లాం తీవ్ర వాదుల చేతుల్లో భయంకరమైన హింసకు, మారణకాండకు గురి అవుతున్నారు. ఈ మారణకాండ లలో కొన్ని వేల మంది యేజిది పురుషులు చనిపోగా కొన్ని వేల మంది స్ర్తీలు, ఆడపిల్లలు ఈ ఇస్లామిక్ తీవ్రవాదుల చేతుల్లో బానిసలుగా బంధింపబడి వర్ణించలేనటువంటి అత్యాచారాలకు గురి అయ్యారు.

ఇరాక్లో ఐసిల్ అంటే “ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంట్ ” ముందున్న అల్-ఖైదా ఈ యాజిదీలను అవిశ్వాసులుగా నిర్ధారించారు. ఈ మతపరమైన నిర్ధారణ వారిని విచక్షణారహితంగా చంపడానికి అనుమతించింది.
ఇస్లామిక్ మత మౌఢ్యం మరింత విస్తృతంగా పెరగడం వల్ల వేలాది మంది యాజిదీలు ఐరోపాలో ఆశ్రయం పొందడానికి వలస పోయారు. కొన్ని అంచనాల ప్రకారం, ఇరాక్ నుండి లక్షల మందికి పైగా యాజిదీలు దేశం విడిచి పారిపోయారు. ఇస్లాం మతం తీసుకోడానికి అంగీకరించని వారిపై దారుణ మారణకాండ జరిపారు
ఈ ఇస్లామిక్ తీవ్రవాద దాడులకు భయపడి గత అనేక సంవత్సరాలుగా, యాజిదీల ఆధ్యాత్మిక నాయకుడు బాబా షేక్, యాజిదీల పవిత్ర ప్రదేశమైన లలేష్ దేవాలయంలో అధికారిక వార్షిక మతపరమైన వేడుకలను దాడులకు భయపడి రద్దు చేసుకున్నారు.
ఇప్పుడు ఈ లాలేశ్ ప్రదేశమే హింసకు గురి అయిన యాజిదీలకు ఆశ్రయంగా మారినట్లు సమాచారం.
అన్నిటి కంటే ఈ యేజీది ల మీద దారుణం జరిగింది 2014 లో ఆగస్ట్ 3 వ తేదీన . ఆ తరువాత నరమేధం నెలల తరబడి కొనసాగింది.
….చాడా శాస్త్రి…