తిహార్ జైలులో శుక్రవారం నుంచి నిరాహారదీక్ష చేస్తున్న కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కు బీపీ పెరగడంతో ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా ఆయనకు యావజ్జీవ శిక్ష పడింది. మంగళవారం ఆస్పత్రికి షిఫ్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే తనకెలాంటి వైద్య సౌకర్యం అక్కర్లేదని మెడికల్ ఫెసిలిటీ అధికారులకు ఆయన లేఖ సమర్పించినట్టు తెలిసింది. రుబియా సయీద్ అపహరణ కేసులో నిందితుడైన యాసిన్ మాలిక్ జమ్మూకశ్మీర్లో జరుగుతున్న ఈ కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోరుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు స్వయంగా తానే వివరణ ఇస్తానని… సాక్షులను తానే క్రాస్ ఎగ్జామిన్ చేస్తానని…. తనను జమ్మూ జైలుకు తనను బదిలీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి కేంద్రం స్పందించకపోవడంతో ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు.