ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన కశ్మీరీ వేర్పాటువాది, నిషేధిత జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్కు మరణశిక్ష విధించాలని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కోరింది. 2017లో కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం సహా వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలపై నేరాన్ని అంగీకరించడంతో మాలిక్ను దోషిగా నిర్ధారించింది ఢిల్లీకోర్టు.
ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్సింగ్ ముందు ఈ వ్యాజ్యాన్ని ఎన్ఐఏ సమర్పించింది. ఈ కేసులో శిక్షపై ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించనుంది. మరణశిక్షకు బదులు జీవిత ఖైదు విధించాలని డిఫెన్స్ లాయర్ కోరారు.
తీర్పుకు ముందు, శ్రీనగర్లోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక షట్డౌన్ అమలులో ఉంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా నగరంలో భద్రతా బలగాలను మోహరించారు. లాల్ చౌక్లోని కొన్ని దుకాణాలను.. మైసుమా సహా పరిసర ప్రాంతాల్లోని చాలా దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేశారు.