వేర్పాటువాద నాయకుడు ఉగ్రవాది యాసిన్ మాలిక్కు ఢిల్లీ NIA కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించడంతో ఇస్లామిస్టులు నిరసనకు దిగారు. తీర్పునకు ముందే శ్రీనగర్లోని వాతావరణాన్ని అక్కడి ఇస్లాం వాదులు చెడగొట్టే ప్రయత్నం చేశారు. శ్రీనగర్లోని మైసుమా ప్రాంతంలో యాసిన్ మాలిక్ మద్దతుదారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. యాసిన్ మాలిక్ మద్దతుదారులు భద్రతా బలగాలపై రాళ్లు విసిరారు. ముందుజాగ్రత్త చర్యగా భద్రతా బలగాలు ముందుకొచ్చి జనాన్ని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. వెంటనే శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. రాళ్ల దాడి ఘటనతో నగరం మొత్తం బంద్ పెట్టారు. అయితే, తీవ్రవాద నిధుల ఆరోపణలపై యాసిన్ మాలిక్కు కోర్టు జీవిత ఖైదు విధించిన తర్వాత హింసాత్మక నిరసనలు తీవ్రమయ్యాయి. తీర్పు వెలువడిన తర్వాత శిక్షకు వ్యతిరేకంగా తమ నిరసనను నమోదు చేసేందుకు ఇస్లాంవాదులు వీధుల్లోకి వచ్చారు. శ్రీనగర్ వీధుల్లో గుంపు రాళ్లు విసురుతున్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు వెలువడ్డాయి.
https://twitter.com/KreatelyMedia/status/1529458322591473664?s=20&t=bG0NGP0vAB7AHbOIQBi3JQ
https://twitter.com/GarudUpdates/status/1529464463748763648?s=20&t=iQbIZ-UXkYvYsgDY8fQiVg
అంతకుముందు యాసిన్ మాలిక్ ఇంటి బయట పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ డ్రోన్ల ద్వారా నిఘా కొనసాగిస్తున్నారు. యాసిన్ మాలిక్ ఇంటి బయట ఈ రాళ్లదాడి, నిరసనలు జరుగుతున్నాయి. శ్రీనగర్ సమీపంలోని మైసుమాలో యాసిన్ మాలిక్ ఇల్లు ఉండటం గమనార్హం. ఇప్పటికే జమ్మూకశ్మీర్ యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే బుధవారం యాసిన్ మాలిక్ మద్దతుదారులు నేరుగా భద్రతా దళాలతో ఘర్షణ పడి, వారిపై రాళ్లు విసిరారు.
https://twitter.com/_TheBite/status/1529464556199628800?s=20&t=zp6V7-1uR4EJUAvA2Xohmw
https://twitter.com/waseem_andrabi/status/1529464112203563008?s=20&t=COxLV6by5Nfoz9D5VMLYlQ
మే 25న, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చినందుకు కాశ్మీరీ వేర్పాటువాది యాసిన్ మాలిక్కు ప్రత్యేక NIA కోర్టు జీవిత ఖైదు విధించింది. మే 19న UAPA కింద కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. మే 10న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నిధుల కార్యకలాపాలతో తనకు సంబంధం ఉందని అంగీకరించిన అతను ఈ కేసులో ముందుగా నేరాన్ని అంగీకరించాడు. NIA మాలిక్కు మరణశిక్ష విధించాలని కోరింది.
మాలిక్కు రెండు జీవిత ఖైదులు, 10 నేరాలకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అలాగే రూ. 10 లక్షల ఆర్థిక జరిమానా విధించారు. అయితే శిక్షలన్నీ ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించింది.