2017లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన తీవ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఢిల్లీ కోర్టు ముందు హాజరయ్యాడు వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్. కఠినమైన అన్ లాఫుల్ యాక్టీవిటీస్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ (UAPA) సహా తనపై ఉన్న అన్ని ఆరోపణలను అంగీకరించాడు.
https://twitter.com/PTI_News/status/1524046168367693824?s=20&t=dyFvfabjjwd0012aUH9ioA
మాలిక్ పై UAPA లోని సెక్షన్ 16 (ఉగ్రవాద చట్టం), 17 (ఉగ్రవాద చర్యకు నిధులు సేకరించడం), 18 (ఉగ్రవాద చర్యకు కుట్ర), 20 (ఉగ్రవాద ముఠా,సంస్థలో సభ్యుడు కావడం), ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 120-B (నేరపూరిత కుట్ర) సహా 124-A (దేశద్రోహం) కింద కేసులు ఉన్నాయి. మాలిక్పై మోపబడిన నేరాలకు సంబంధించిన శిక్షలకు సంబంధించిన వాదనలను మే 19న స్పెషల్ జడ్జ్ ప్రవీణ్ సింగ్ వింటారు. మాలిక్పై వచ్చిన ఆరోపణలకు గరిష్టంగా జీవిత ఖైదు శిక్ష వేసే అవకాశాలున్నాయి.
మాలిక్ తోపాటు ఫరూక్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటే, షబ్బీర్ షా, మసరత్ ఆలం, ఎండీ యూసుఫ్ షా, అఫ్తాబ్ అహ్మద్ షా, అల్తాఫ్ అహ్మద్ షా, నయీం ఖాన్, ఎండీ అక్బర్ ఖాండే, రాజా మెహ్రాజుద్దీన్ కల్వాల్, బషీర్ అహ్మద్ భట్, జహూర్ అహ్మద్ షా వతాలి, షబీర్ అహ్మద్ షా, అబ్దుల్ రషీద్ షేక్, నావల్ కిషోర్ కపూర్ సహా ఇతర కాశ్మీరీ వేర్పాటువాద నాయకులపై కూడా కోర్టు అధికారికంగా అభియోగాలను నమోదు చేసింది.