ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు.
సిన్హా తన నామినేషన్ పత్రాలను పార్లమెంట్ హౌస్లో సమర్పించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎన్సిపి చీఫ్ శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, అభిషేక్ బెనర్జీ, కేటీఆర్ , ఎ. రాజా, సీతారాం ఏచూరి సహా పలువురు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు.
ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరగనుండగా, జూలై 21న ఓట్ల లెక్కింపు జరగనుంది.