మహ్మద్ ప్రవక్తను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీపై ఫిర్యాదు చేశారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. రిజ్వీ ఇటీవల రాసిన ఓ పుస్తకంలో ప్రవక్తను దూషిస్తూ అభ్యంతర పదజాలాన్ని వాడారంటూ ఓవైసీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. నవంబర్ 4న ఘజియాబాద్ లోని దస్నాదేవి ఆలయంలో నర్సింహానంద సరస్వతీ సమక్షంలో ‘మహమ్మద్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అందులో ప్రవక్తను హంతకుడిగా, విమెనైజర్ గా, పిచ్చివాడిగా చూపుతూ రాతలు రాశాడని, అలాగే ఖురాన్ గురించి అభ్యంతరకంగా, అబద్దాలు రాశారని అసద్ ఆరోపించారు. పుస్తకం కవర్ పేజీపై కూడా మహ్మద్ ప్రవక్త, ఓ మహిళ నగ్నంగా ఉన్న చిత్రం ఉంది.
పుస్తకంలో రాసిన అనేక అంశాలు, అభ్యంతరకర వ్యాఖ్యలు మహ్మద్ ప్రవక్తను అనుసరించే, ఇస్లామిక్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నవారి మనోభావాలు దెబ్బతీసేలా, వారికి ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయని అసద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తంగా ఆ పుస్తకం…భారతదేశంలోని ముస్లింలపై శత్రుత్వ భావన పెంచడమే లక్ష్యంగా ఉందని…ఇలాంటి రాతలు, పుస్తకాలు శాంతికి విఘాతం కలిగిస్తాయని అసద్ ఆందోళన వ్యక్తం చేశారు.
సీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఒవైసీ మీడియాతో మాట్లాడారు. రిజ్వీపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తనకు హామీ ఇచ్చారని అన్నారు.“క్రిమినల్ కేసు నమోదైన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం రిజ్వీని అరెస్ట్ చేస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. అతను ముస్లింలను రెచ్చగొట్టాలనే అలాంటి రాతలు రాశాడని…ముస్లిం వ్యతిరేక శక్తులే అతని వెనక ఉన్నాయని ఆరోపించారు.
రిజ్వీ ఒక ప్రగతిశీల ముస్లిం, ఇస్లామిక్ ఛాందసవాదుల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మద్దతు ఇచ్చారు. రామజన్మభూమి అనే చిత్రానికి స్క్రిప్ట్ అందించారు.
ఖురాన్లోని 26 శ్లోకాలు ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలా ఉన్నాయని,,,వాటిని తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఆ పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. దీంతో ఆ 26 శ్లోకాల్ని తొలగించి పవిత్ర గ్రంథం ఇదీ అంటూ కొత్తగా ప్రచురించాడు.
Following our complaint against Wasim Rizvi for creating hatred against Muslims & insulting Prophet Mohammed (PBUH), FIR has been registered and case has been entrusted to SI, Kamatipura PS. We hope that immediate action is taken pic.twitter.com/ccATgwCa5t
— Asaduddin Owaisi (@asadowaisi) November 17, 2021