తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం ముదురుతోంది. ఏకంగా గవర్నర్ పై సుప్రీంకోర్టులోనే ఫిర్యాదు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 10 ముఖ్యమైన బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదించలేదంటూ అత్యున్నత న్యాయస్థానంలో రిటి పిటిషన్ వేసింది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఈ పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీం రేపు విచారణ చేపట్టే అవకాశం ఉంది. తాము పంపిన బిల్లులను ఆమోదించి వెనక్కి పంపకుండా రాజ్ భవన్లోనే ఉంచారని… ఆ బిల్లులు ఆమోదించేలా గవర్నర్ కు ఆదేశించాలంటూ ప్రభుత్వం కోర్టును విజ్ఞప్తి చేసింది. ప్రతివాదిగా గవర్నర్ పేరును చేర్చారు.
గవర్నర్ పై సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం – బిల్లులు ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషన్
Share: