వావ్.. రూ.5/-కే గుడ్డుతో భోజనం.. ఎక్కడో తెలుసా.?
https://twitter.com/ANI/status/1361343630573592579
ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు.. అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతుంటారు. తాజాగా వెస్ట్ బెంగాల్లో కూడా అధికార పార్టీ అలాంటి పథకాన్నే ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ఓటర్లను ఆకర్షించేందుకు సీఎం మమతా బెనర్జీ సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. పేదల కోసం రూ.5/- కే భోజనాన్ని అందించే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి మా కిచెన్ అన్న పేరును పెట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ఈ పథకంతో ప్రభుత్వ ఖజానాపై మరింత భారం పడుతుందని నిపుణులు అంటున్నారు. ప్రతి ప్లేటు భోజనంపై ప్రభుత్వం నుంచి రూ.15/- సబ్సిడీ వస్తుందని దీదీ తెలిపారు. ఈ వంటలు చేయడం కోసం.. కొన్ని ఎన్జీవో సంస్థలు మధ్యాహ్నం 1 నుంచి 3 వరకు సేవలందిచనున్నాయని తెలిపారు. ఇక మెనూలో ఎగ్ కర్రీని కూడా అందించనున్నారు. తక్కువ ఖర్చుతో మూడు రకాల కూరలతో భోజనం అందించడం వల్ల అనేక మంది పేదల కడుపు నిండుతుందని దీదీ పేర్కొన్నారు.