సుప్రీంకోర్టులో ఇటీవల దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో ఒకటి హిందువులకు సంబంధించిందికాగా మరొకటి ముస్లింలకు సంబంధించింది..రెండోదాని గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం..
ఈ PIL దాఖలు చేసిన వాడు ఒక ముస్లీం ఆయన పేరు వసీమ్ రజ్వీ. ఈ PIL ఏ విషయం పై దాఖలు చేశాడో వింటే మీరు ఆశ్చర్యపోతారు. రోగి కోరింది వైద్యుడు ఇచ్చింది ఒకటే మందు అనే సామెత వినే ఉంటారు. సరిగ్గా ఈ సామెతకు సరిపోయే PIL ఇది. ఇక ఈ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ గురించి తెలుసుకుందాం.
వసీమ్ రజ్వీ అనే చదువుకున్న నిజమైన సెక్యులర్ ముస్లీం ఖురాన్ గురించి సుప్రీం కోర్టు తలుపులు తట్టాడు. పైగా ఈయన షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ గా కూడా పనిచేశారు. ఇంతకు ముందు కూడా ఈయన ముస్లీములలోని దురాచారాలను వ్యతిరేకిస్తూ నినదించాడు. ఇప్పుడు ఖురాన్ లో 26 ఆయాత్ లు టెర్రరిజాన్ని ప్రేరేపించేవిగా ఉన్నాయని, వాటిని భారతదేశంలో రద్దు చేయాలని. ఈ 26 ఆయాత్ లు మహమ్మద్ ప్రవక్త చెప్పని ఆయాత్ లని. అవి తరువాతి కాలంలో వచ్చిన ఖలీఫాలు చొప్పించిన ఆయాతులని కాబట్టి వీటిని తొలిగించాలని వసీమ్ రజ్వీ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.
ఈ 26 ఆయాత్ ల వల్ల ముస్లీం సమాజం టెర్రరిస్టు సమాజంగా చూడబడుతుందని. ఈ 26 ఆయాతుల వల్లే ముస్లీం సమాజంలో టెర్రరిస్టులు తయారౌతున్నారని కాబట్టి ఈ 26 ఆయాతులను ఖురాన్ నుండి భారత్ లో తొలగించమని అభ్యర్థించాడు.
ఈ 26 ఆయాత్ లలో ముస్లీం కాని వాడిని కాఫిర్ అనాలని. కాఫిర్ ని చంపినా తప్పులేదని, ఎక్కువ మంది కాఫిర్లను చంపితే వారికి జన్నత్ (స్వర్గం) దొరుకుతుందని చెబుతాయి. జిహాద్(కాఫిర్లపై యుద్దం) అనేది జన్నత్ కి(స్వర్గానికి) మార్గం అనే యుద్దానికి ప్రేరేపిస్తాయి.
ఇక పైన సామెత రోగి కోరింది వైద్యుడిచ్చింది ఒకే మందు అనే సామెతకు సార్థకత ఎక్కడంటే. హిందువులు కోరేది కూడా అదే, అదే విషయాన్ని ముస్లీము మతస్థుడు ఈ టెర్రరిస్టు ఆయాతులను తొలగించమని సుప్రీం కోర్టును కోరడం ఆహ్వానించ దగ్గ పరిణామం. ఇక సుప్రీం కోర్టు ఎటువంటి నిర్ణయాన్ని ఇస్తుందనేది వేచి చూడాల్సిన విషయం.
ఈ 26 ఆయాత్ లను తొలగించమని కోరింది ముస్లీమే కాబట్టి ఇది మంచి పరిణామమే.
అన్ని మతాలలో మంచిని కోరే వారు ఉన్నారనడానికి ఇది గొప్ప ఉదాహరణ. వసీమ్ రజ్వీకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం….
భారతదేశానికి మంచి రోజులు వస్తున్నాయనడానికి ఇది ఒక శుభ పరిణామం మరియు నాంది వాచకం.
మీ కోసం
మీ మదన్ గుప్త