టర్కీలో భారత ఆర్మీ సహాయచర్యల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే భారత సైన్యం సాయాన్ని చూస్తూ… ఓ టర్కీ మహిళ మన సైనికురాలిని ముద్దాడిన ఫొటో ప్రపంచవ్యాప్తంగా సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆర్మీ అధికారే మేజగ్ బీనా తివారీ. టర్కీ వెళ్లిన వైద్య బృందంలో బీనా ఒక్కరే మహిళ. అక్కడ తాత్కాలిక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి బీనా ఆధ్వర్యంలో సేవలు అందించారు. డెహ్రాడూన్ కు చెందిన బీనా… ఢిల్లీలోని మెడికల్ కాలేజీలో చదివి ఆర్మీలో చేరారు.టర్కీలో తాజాగా ఆమె సేవల్లో ఉన్న ఫొటోను భారత ఆర్మీ సైతం షేర్ చేస్తూ మేం ఉన్నా..మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని టర్కీ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించింది. అయితే తాజాగా బీనా ఓ బాలికను కాపాడిన చిత్రాన్ని షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. “ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం మనది. సహాయక చర్యలు, పీస్ కీపింగ్ లో మనకెంతో అనుభవం ఉంది. ఇదీభారత్ ఇమేజ్”అని ఆయన ట్వీట్ చేశారు.
https://twitter.com/anandmahindra/status/1625405592402821121?s=20&t=-jPA4HuwpT9t4KNQ4mvfqg