పశ్చిమ బెంగాల్ నదియాకు చెందిన బీరేన్ కుమార్ ప్రధాని మోదీకి ఓ అఫూర్వ కానుక అందజేశారు. భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాలతో కూడిన విభిన్న అంశాలను జోడిస్తూ రూపొందించిన వస్త్రాన్ని ఆయన మోదీకి బహుకరించారు. భారతీయతను ప్రతిబింబిస్తూ ఆయన చిత్రించిన చీరలు ఎంతో ప్రసిద్ధిచెందాయి. రాష్ట్రపతి భవన్లో పద్మపురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా ఓ వస్త్రాన్ని మోదీకి అందజేశారు బీరేన్ కుమార్.
బీరేన్ కుటుంబం బంగ్లాదేశ్ నుంచి 1960లో భారత్ కు వలసవచ్చింది. నాటి నుంచి ఆ కుటుంబం పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లా పులియాలో స్థిరపడింది. బసక్ నైపణ్యం గల నేత కళాకారుడిగా ఎదిగిన బీరేన్ ఆ కళలో అద్భుతాలు చేశారు. కళారంగంలో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది.
13 ఏళ్ల వయస్సులో తన సోదరుడితో కలసి రోజూ కోల్కతాకు 85 కిమీ రైలులో ప్రయాణించి చీరల మూటలతో వీధుల్లో తిరుగుతూ అమ్మకాలు చేసిన బీరేన్…ఈ రోజు 5 వేల మంది నేతకార్మికులకు ఉపాధినిస్తూ 25 కోట్ల వార్షిక టర్నోవర్ కు వ్యాపారాన్ని విస్తరించారు. నేత చీరపై రామాయణాన్ని చిత్రించి… UK వరల్డ్ రికార్డ్ విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేట్ ను అందుకున్నాడు. పొడవైన చీరనేసి గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్నాడు.