ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక పాఠశాలల్లో ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవం గా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నేడు ప్రపంచ దేశాలు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. చదువుకునే విద్యార్థులకు, అన్ని వయసులో గల వారికి, నిత్యం బిజీ లైఫ్స్టైల్తో టెన్షన్ పడుతున్న యువతకు ఒత్తిడి నుంచి ఉపశమనం అందించేందుకు ధ్యానం/మెడిటేషన్ మంచి సాధనం లాంటిది అని యోగ ఉపాధ్యాయురాలు మునిగెల యోగిత తెలియజేశారు. యోగా టీచర్ హోదాలో అనేక పాఠశాలల్ని దర్శించి ధ్యాన దినోత్సవం లో ఆమె పాలు పంచుకొన్నారు.
బోథ్ మండలములోని సోనాల గ్రామములో వివేకానంద పాఠశాలలో ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య, ఓరుగంటి ఇస్తారి,కోస్మెట్ శుద్ధోధన్, ఉపాధ్యాయ బృందం,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు… బోథ్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా స్కూల్ విద్యార్థులు మెడిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు..ప్రతి ఒక్కరు యోగ ఆసనాలతో పాటు ధ్యానం (మిడిటేషన్) ఏకాగ్రతను అలవర్చుకోవాలి అని పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు పాఠశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం ఘనంగా జరిగింది. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్లొన్నారు.
స్థానిక వేదం పాఠశాలలో తొలి ధ్యాన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ధ్యానం రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గిస్తుందని ప్రధానోపాధ్యాయులు వివరించారు.అదేవిధంగా విద్యార్థులు ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పచ్చిపాలు సంతోష్ ,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు …
More Photos :