భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అతరించడానికి రాబోయే పదేళ్లు కీలకమని, అది మనకు అమృతకాలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వరుసగా రెంండుసార్లు సుస్థర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దేశప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా… ఉభయసభలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. మోదీ నేతృత్వంలోని కేంద్రం ఎప్పుడూ దేశప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని అన్నారు. సమాజానికి, దేశానికి దిశా నిర్దేశం చేయడానికి యువత, నారీశక్తి ముందు వరుసలో ఉండాలని తెలిపారు. కాలానికి రెండు అడుగులు ముందు నిలిచే యువత గల దేశంగా భారత్ ఎదగాలని ముర్ముఅన్నారు. ప్రజాస్వామ్యానికి, సాంఘిక న్యాయానికి అతి పెద్ద శత్రువు అవినీతి అని తన ప్రభుత్వానికి స్పష్టమైన అభిప్రాయం ఉందని… అందుకే గత కొన్ని సంవత్సరాల నుంచి అవినీతిపై నిరంతర పోరాటం చేస్తున్నామని అన్నారు. అవినీతి రహిత దేశంగా మారే దిశగా భారత్ పయనిస్తోందని రాష్ట్రపతి అన్నారు. ఒక దేశం-ఒకే రేషన్ కార్డ్, జన్ ధన్-ఆధార్-మొబైల్ నంబర్ల అనుసంధానం వల్ల బూటకపు లబ్ధిదారులను తొలగించగలిగినట్లు తెలిపారు. అతి పెద్ద శాశ్వత సంస్కరణను అమలు చేశామని చెప్పారు.నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా రక్షణ రంగంలో ఎగుమతులు ఆరు రెట్లు పెరిగాయని ద్రౌపది ముర్ము చెప్పారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని… ఆయుధాలు, మందుగుండు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర పరికరాలను మన దేశంలోనే తయారు చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తోందనీ ముర్ము ప్రసంగంలో తెలిపారు.
https://twitter.com/rashtrapatibhvn/status/1620293275755360258?s=20&t=MGS8Lh79n9ah-Kxzd5j1vQ