తమిళనాడు నాగపట్నం జిల్లా అధమంగళంలోని కీజా కన్నాపూర్లో ఓ మద్యం దుకాణాన్నిమహిళలు ధ్వంసం చేశారు. పుదుచ్చేరి నుంచి అక్రమంగా తీసుకువచ్చి మద్యం విక్రయిస్తున్నారంటూ వారీ పనికి పాల్పడ్డారు. పదేళ్లుగా అక్కడ ఆ దుకాణం నడుస్తోంది.రోజూ అక్కడ బాగా తాగి మగవాళ్లు తమను పిల్లలను చావబాదుతున్నారని వారు వాపోయారు. ఇటీవలే తాగుడుకోసం ఓ వ్యక్తి భార్య మంగళసూత్రాలు అమ్మేశారు. నిలదీసిన భార్యను కొట్టాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానిక మహిళలు మద్యం దుకాణంపై విరుచుకుపడ్డారు. మద్యం సీసాలను, దుకాణాన్ని ధ్వంసం చేశారు.