సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్కు ఇచ్చిన ‘పద్మశ్రీ’ అవార్డును వెనక్కి తీసుకోవాలని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా డిమాండ్ చేశారు. 2002 గుజరాత్ అల్లర్లలో కల్పిత సాక్ష్యాలకు సంబంధించిన కేసులో సెతల్వాద్ను గుజరాత్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఆమెను జూలై 2 వరకు గుజరాత్ పోలీసుల కస్టడీకి పంపారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన క్లీన్ చిట్ను సుప్రీంకోర్టు సమర్థించడంతో తీస్తాను అరెస్ట్ చేశారు.
ఆమె ‘అవార్డ్ వాప్సీ’ గ్యాంగ్ సభ్యురాలు. ఆమె అవార్డు వెనక్కి ఇవ్వలేదు కానీ… అలాంటివారిపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అయినా తీస్తానుంచి అవార్డును తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీస్తాకు పద్మశ్రీని ప్రదానం చేసింది.