సోషల్మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే బీజేపీ నేత విజయశాంతి 2 వేల నోటు ఉపసంహరణపై ఫేస్ బుక్ లో స్పందించారు. ఆర్బీఐ తాజా నిర్ణయంపై కొన్ని వర్గాలు మాత్రమే గుండెలు బాదుకుంటున్నాయన్నారు. సామాన్య ప్రజలనుంచి ఎలాంటి వ్యతిరేకత లేకున్నా…గులాబీ నేతలు మాత్రం గుబులెక్కి శివాలెత్తుతున్నారని ఆమె అన్నారు. 2016లో 500, 1000 నోట్ల రద్దు సమయంలోనే తాత్కాలిక సర్దుబాటుగా 2 వేల నోటును ప్రవేశపడుతున్నట్టు ఆర్బీఐ చెప్పిందని విజయశాంతి గుర్తు చేశారు. ఆ సమయంలో ఎన్నినోట్లు మురికి కాల్వల్లో తేలాయో..ఎంత నల్లధనం అగ్నికి ఆహుతైందో చెప్పాల్సిన పనేలేదన్న విజయశాంతి.. విపక్ష పార్టీలను దెబ్బకొట్టడానికే ఈ నిర్ణయమన్న ఆరోపణల్ని ఖండించారు. నిజానికి ‘గులాబీ’ నోటు రద్దుతో గుండెలు బాదుకుంటున్నవాళ్లు ఎవరైనా ఉంటే అది తెలంగాణలోని అధికార ‘గులాబీ’ దళం మాత్రమే.
రాష్ట్రంలో పెచ్చురిల్లిన అవినీతి, అక్రమార్జన తీరుని గమనిస్తే అధికారగణం దగ్గర తప్ప ఇంకెక్కడా ఈ 2 వేల నోట్ల కుప్పలు భారీగా కనిపించే పరిస్థితి లేదు. అందుకే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేకపోయినా ‘గులాబీ’ నేతలు మాత్రం గుబులెక్కి శివాలెత్తిపోతున్నరు. లక్షల కోట్ల 2 వేల రూపాయల నోట్లు ‘గులాబీ’ రంగే కదా! బీఆర్ఎస్ పేర దేశమంతా తోరణాలు కట్టుకోర్రి, నోట్ల రద్దే లేకుంటే ఈ దోపిడీ నోట్ల పంపిణీ దేశమంతా జరిపించేవారు మీరు, రాజ్దీప్ సర్దేశాయ్ అనే జర్నలిస్ట్ బయటకు చెప్పిన నిజాల ప్రకారం’’ అని ఆమె రాసుకొచ్చారు.
https://twitter.com/vijayashanthi_m/status/1660668119151681536?s=20