భారత దేశ చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద, నార్వే చెస్ గ్రూప్ A ఓపెన్ చెస్ టోర్నమెంట్లో తొమ్మిది రౌండ్లలో 7.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. 16 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ తొమ్మిది రౌండ్లలో అజేయంగా నిలిచాడు. అతను నిన్న ఫెలో ఇండియన్ వి. ప్రణీత్పై విజయం సాధించి టోర్నీని ముగించాడు.
ప్రణీత్ను ఓడించడమే కాకుండా విక్టర్ మిఖలెవ్స్కీ (8 రౌండ్ లో), విటాలీ కునిన్ (6 రౌండ్), ముఖమ్మద్జోఖిద్ సుయారోవ్ (4 రౌండ్), సెమెన్ ముతుసోవ్ (2 రౌండ్) సహా మథియాస్ ఉన్నెలాండ్ (1 రౌండ్)పై ప్రజ్ఞానంద విజయాలు నమోదు చేశాడు.