పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్రం. సమావేశాలు సజావుగా సాగేలా అన్ని పార్టీలు సహకరించాలని ప్రభుత్వం ఆయాపార్టీలను కోరింది. ఈ సమావేశాల సందర్భంగా పలు కీలక బిల్లుల ఆమోదం, కొన్ని బిల్లుల పైన సమగ్ర చర్చ జరగనుంది. డిసెంబర్ 29 వరకు దాదాపు 17 రోజులపాటు సమావేశాలు జరుగుతాయి. అఖిలపక్ష భేటీకి రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, లోక్ సభలో విపక్షనేత ఆధిర్ రంజన్ చౌదరి, పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్ జోషి సహా పలు పార్టీల నాయకులూ హాజరయ్యారు.