పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభంకాగానే కొత్తగా ఎన్నికైన ఎంపీలతో స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవలే హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతిపట్ల సంతాపం తెలుపుతూ సభ నివాళులర్పించింది. ఆగస్టు 12 వతేదీవరకు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఇక ధరల పెరుగుదల వంటి అంశాలపై అధికార పార్టీపై యుద్ధానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. శీతాకాల సమావేశాలు శుభప్రదంగా, ఫలప్రదంగా జరగాలని ఆకాంక్షిస్తూ సహకరించాలని విపక్షపార్టీలకు విజ్ఞప్తి చేశారు.రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో సభ్యులంతా తమ ఓటు వినియోగించుకోవాలని మోదీ కోరారు.
https://twitter.com/narendramodi/status/1548882063843270656?s=20&t=7-nS26G9yH2Upf1EhMztXQ