బీజేపీ నీచరాజకీయాలు చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లల్లో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేసిందన్నారు. మోదీ కంటే ముందు ఈడీ దిగుతుందని…తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలున్న నేపథ్యంలోఇప్పుడు ఈడీ తెలంగాణకు వచ్చిందన్నారు. తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసుల్ని లెక్కచేయాల్సిన అవసరం లేదన్నారు. జైల్లో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చని సవాల్ చేశారు కవిత.