నిన్నంతా ముంబైలో బిజీగా గడిపిన కేసీఆర్ తిరిగి వచ్చాక అదే జోరు కొనసాగిస్తున్నారు. ఇవాళ నారాయణ్ ఖేడ్ బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాల్లో ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మత రాజకీయాలు చేసేవారికి ప్రజలే బుద్ధి చెప్పాలని హెచ్చరిస్తూ…దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉందని అన్నారు. బంగారు తెలంగాణలాగా దేశాన్ని బంగారు భారత్ గా మార్చుకుందామని పిలుపునిచ్చారు. అమెరికా లాగా దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన కేసీఆర్… ఇప్పుడు మన పిల్లలు అమెరికా వెళ్తున్నారని.. కానీ అమెరికా సహా ఇతర దేశాల వాళ్లే మన దగ్గరికి వచ్చేలా తీర్చిదిద్దుకోవాలని కేసీఆర్ అన్నారు.
అందుకు ఢిల్లీ దాకా వెళ్లి కొట్లాడుదామా లేదా అని ప్రశ్నించారు. పోరాడ్డానికి తానున్నానని మీరంతా ఆశీర్వదించాలని సభలో ఉన్న జనాన్ని ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు.