సీనియర్ జర్నలిస్ట్ వై. శ్రీనివాసరావు కరోనాతో కన్నుమూశారు. గతంలో
ఆంధ్రపత్రిక-ఆంధ్రప్రభలో సీనియర్ రిపోర్టర్ గా, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ గా,ఎడిట్ పేజ్ -సాహితీ గవాక్షం ఇంచార్జ్ గా…ఆదివారం అనుబంధం ఇంచార్జ్ గా పని చేశారు. జాగృతి వార పత్రిక అనధికారిక ఎడిటర్ గా కొనసాగారు. నిజాయతీపరుడైన జర్నలిస్టుగా ఆయన పేరు తెచ్చుకున్నారు..
తన జీతంలో 70 శాతం అనాథ పిల్లల కోసం ఖర్చు చేసిన గొప్పవ్యక్తి. మానవత్వానికి, నిజాయితీ కి, నైతిక విలువలకు నిలువుటద్దంగా నిలిచారు.
ఆరెస్సెస్ భావజాలాన్ని గౌరవిస్తూ, ఆచరిస్తూ జీవించారు. వివాహం చేసుకోని ఆయన…ఓ అనాథ గిరిజన చిన్నారిని దత్తత తీసుకున్నారు. ఉన్నత చదువులు చదివించారు…
దత్తపుత్రికకు పెళ్లిచేయాలనీ వరుడి అన్వేషణలో ఉన్నసమయంలో ఆయన్ని కరోనా బలితీసుకుంది. వైఎస్సార్ ను కాపాడుకునేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నం ఫలించలేదు..
బన్సీలాల్ పేట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి కోరిక మేరకు పెంపుడు కుమార్తె వైఎస్సార్ చితికి నిప్పంటించింది. జాతీయవాది అయిన శ్రీనివాసరావు నిజాయతీగల జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్నారు. శ్రీనివాసరావు మరణంపట్ల జర్నలిస్టులు సంతాపం వ్యక్తంచేశారు